హైదరాబాద్: 'మనం ధోనీకి ఎంత గౌరవం ఇస్తామోఅతను కూడా మనకు అంత గౌరవం ఇస్తాడు. అందుకే అతన్ని గొప్ప సారథి అంటారు' అని చెబుతున్నాడు ఇర్ఫాన్ పఠాన్. మహేంద్ర సింగ్ ధోనీపట్ల ప్రతి ఒక్కఅభిమానికిఎంతో గౌరవం ఉంటుంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తనదైన బ్యాటింగ్ శైలితో, నాయకత్వంతోటీమిండియాకు రెండు ప్రపంచకప్లు అందించిన ఘనత ధోనీ సొంతం.
తాజాగా పఠాన్ మీడియాతో మాట్లాడుతూ... 'నేను ధోనీ నాయకత్వంలో చాలా మ్యాచ్లు ఆడాను. యువ ఆటగాళ్లపై ధోనీ చూపించే అభిమానం వేరేలా ఉంటుంది. ఎవరైనా సరే ధోనీ వద్దకు ఎప్పుడైనా వెళ్లి చాలా ఫ్రీగా మాట్లాడొచ్చు. మొదటిసారి జట్టులోకి వచ్చిన వాళ్లైనా సరే. మనం అతనికి ఎంత గౌరవం ఇస్తామో అతడు అంతే గౌరవమిస్తాడు. మన మాటలు వినేందుకు చొరవ చూపుతాడు. అంతేకాదు మనపై ఫుల్ అటెన్షన్ ఉంచుతాడు. ఎందుకంటే మనంఅప్పుడే కొత్తగా జట్టులోకి వచ్చి ఉంటాం కాబట్టి. దీన్ని పట్టించుకోనవసరం లేదు. కోపంగా, ముభావంగా ఎప్పుడూ ఉండడు. అందుకే ధోనీని గొప్ప కెప్టెన్ అంటారు' అని పఠాన్ తెలిపాడు.
ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ జట్టును గాయాల సమస్య వేధిస్తుండగా.. ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ కూడా గాయపడిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. తొడ కండరాలు పట్టేయడంతో రెండు వారాలపాటు అతడు ఐపీఎల్కు దూరమయ్యాడు. సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ముంబైతో మ్యాచ్ అనంతరం ఈ విషయాన్ని ధృవీకరించారు.
రెండేళ్ల నిషేధం అనంతరం ఈ ఏడాది ఐపీఎల్ ఆడుతోన్న చెన్నై సూపర్కింగ్స్కు ధోనీ నాయకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నై పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.