
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఆడనున్న తమ దేశపు ఆటగాళ్లనుద్దేశించి రికీ పాంటింగ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ వేలం జనవరి 27, 28తేదీల్లో జరగనుంది. ఈ వేలంలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశ ఆటగాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. ఈ ఎంపిక ప్రక్రియ గురించి ఆయన మీడియాతో కాసేపు ముచ్చటించారు.
ఢిల్లీ డేర్ డెవిల్స్ కోచ్ రికీ పాంటింగ్ బెంగుళూరులో జరగునున్న వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాగా లాభపడతారని పేర్కొన్నాడు. ఇటీవలే ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రధాన కోచ్గా నియమింపబడ్డ పాంటింగ్ ఇంతకుముందు ముంబై ఇండియన్స్ జట్టుకు కోచ్గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా ఆటగాళ్లైన స్టీఫెన్ హామింగ్, బ్రాడ్ హాడ్జ్( జట్టు కోచ్గా కింగ్స్ ఎలెవన్ పంజాబ్) , డాన్ వెట్టోరీ(రాయల్ ఛాలెంజర్స్), నాతో(ఢిల్లీ డేర్ డెవిల్స్ కలిపి ఐపీఎల్ నాలుగు జట్లు తరపున ఆడనున్నామని ఆయన పేర్కొన్నారు. కొద్ది రోజుల ముందు వరకు తెలిపిన ధరలను బట్టే క్రీడాకారులతో పాటుగా కోచ్లకు కూడా మంచి ధరే లభిస్తుందని వివరించాడు.
పాంటింగ్ స్వయం విశ్లేషణను ఈ విధంగా చేసుకున్నాడు. "అతను చాలా నిబ్బరమున్న వ్యక్తి, మంచి నేర్పు ఉన్న క్రీడాకారుడు, నువ్వు సమస్యలన్నీ ఒక్క చోటకు చేర్చినా వాటికి సమాధానమివ్వగలడు. చరిత్రలో నిలిచిపోయే బౌండరీలను సాధించిన వాడు. మొత్తానికి అతను ఓ సంపూర్ణమైన పాకేజి." అంటూ అతని స్వభావాన్ని వివరించుకున్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.