హైదరాబాద్: ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్, బెంగళూరు పోటీలో డివిలియర్స్ కీలక పాత్ర వహించాడు. దూకుడైన ఇన్నింగ్స్తోనూ బందోబస్తైన ఫీల్డింగ్తోనూ వీక్షకులను కట్టిపడేశాడు. హైదరాబాద్ జట్టును పరుగులు చేయకుండా తొక్కి పడేశాడు. ఇలాంటి శైలి ప్రదర్శిస్తాడు కాబట్టే, ప్రపంచ క్రికెట్లో ఏబీ డివిలియర్స్ది ప్రత్యేకస్థానం. బ్యాట్స్మన్గానే కాదు.. కీపర్గా, ఫీల్డర్గా చెరగని ముద్ర అతని సొంతం.
ఐపీఎల్ తాజా సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్లో మెరిసిన డివిలియర్స్.. ఆపై అద్భుతమైన క్యాచ్ను పట్టి ఫీల్డింగ్లో కూడా తనదైన మార్కును మరోసారి చూపెట్టాడు. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో ఆర్సీబీ బౌలర్ మొయిన్ అలీ వేసిన ఎనిమిదో ఓవర్ ఆఖరి బంతిని అలెక్స్ హేల్స్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. ఆ సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న డివిలియర్స్ గాల్లో అమాంతం ఎగిరి క్యాచ్ను ఒంటి చేత్తో అందుకున్నాడు.
ఆ క్రమంలోనే బౌండరీ లైన్ తాకకుండా తనను తాను అద్భుతంగా నియంత్రించుకున్న తీరు మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. ఏబీ సెన్సేషనల్ క్యాచ్తో చిన్నస్వామి స్టేడియం మార్మోగిపోయింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ 219 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఏబీ డివిలియర్స్(69), మొయిన్ అలీ(65)లు చెలరేగి ఆడగా, గ్రాండ్ హోమ్ (40)బ్యాట్ ఝుళిపించడంతో ఆర్సీబీ భారీ స్కోరకు నమోదు చేసింది.
చేధనలో హైదరాబాద్ జట్టు బ్యాటింగ్కు పని చెప్పాల్సి వచ్చింది అక్కడకి కష్టపడి పరుగులు చేస్తుండగా బెంగళూరు ఫీల్డింగ్కు హైదరాబాద్ వణికిపోయింది. ఈ క్రమంలో 14 పరుగుల తేడాతో బెంగళూరు హైదరాబాద్పై విజయం సాధించింది.