హైదరాబాద్: బెంగళూరు వేదికగా ముంబైతో ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని 143గా నిర్దేశించింది.
గాయం నుంచి పూర్తిగా కోలుకున్న బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేశాడు. 47 బంతుల్లో 62, 5 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో విరాట్ కోహ్లీ అర్ధసెంచరీని పూర్తి చేశాడు. ఈ మ్యాచ్లో క్రిస్గేల్తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించాడు.
తొలి రెండు ఓవర్లు దూకుడుగా ఆడిన ఈ జోడి ఆ తర్వాత దూకుడుగా ఆడింది. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 63 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముంబై బౌలర్ టిమ్ సౌథీ వేసిన మూడో ఓవర్లో విరాట్ కోహ్లీ 17 పరుగులు రాబట్టాడు.
ఆ ఓవర్ తొలి బంతిని సిక్స్ కొట్టిన కోహ్లీ, ఆ తరువాత మూడు, నాలుగు బంతుల్ని ఫోర్లుగా మలచాడు. ఆ ఓవర్లో 17 పరుగులు సాధించి స్కోరు బోర్డులో వేగం పెంచాడు. ఆపై తర్వాత వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డు వేగాన్ని పెంచారు.
బెంగళూరు ఆటగాళ్లలో క్రిస్ గేల్ (22), ఏబీ డివిలియర్స్ (19), కేదర్ జాదవ్(9), మన్ దీప్(0)లు పెద్దగా రాణించలేదు. దీంతో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మెక్లీన్ గన్ రెండు వికెట్లు తీసుకోగా, హర్ధిక్ పాండ్యా, కృణాల్ పాండ్యాలకు తలో వికెట్ దక్కింది.
బెంగళూరు Vs ముంబై మ్యాచ్ హైలెట్స్:
* ఐపీఎల్ పదో సీజన్లో అరంగేట్రం చేసిన తోలి మ్యాచ్లోనే విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 62 పరుగులు చేశాడు.
* ఈ మ్యాచ్లో కోహ్లీ ఐదు ఫోర్లు, రెండు సిక్సులు బాదాడు.
* క్రిస్ గేల్ 22 పరుగుల వద్ద తొలి వికెట్ గా వెనుదిరిగాడు.
* 16వ ఓవర్లో మిచెల్ మెకన్ గన్ ఓవర్ లో కోహ్లీ జోస్ బట్లర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
* ఏబీ డివిలియర్స్ను కృనాల్ పాండ్యా పెవిలియన్కు పంపాడు. రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్ పట్టాడు.
* ఏబీ డివిలియర్స్పై కృనాల్ పాండ్యా బౌలింగ్ గణాంకాలు 3-17.
* చివరి 5 ఓవర్లలో బౌండరీ లేకుండానే బెంగళూరు 31 పరుగులు చేసింది.
* 142 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైని నిలువరించేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ బౌలింగ్ శామ్యూల్స్ బద్రీకి ఇచ్చాడు.
* రెండో ఓవర్లో స్టువర్ట్ బిన్నీని తొలి వికెట్గా జోస్ బట్లర్ తీశాడు.
* ఐపీఎల్ పదో సీజన్లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. బెంగళూరు బౌలర్ శామ్యూల్స్ బద్రీ హ్యాట్రిక్ వికెట్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
* ఐపీఎల్ పదో సీజన్లో బద్రీ ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్ బద్రీ 4-1-9-4 గణాంకాలను నమోదు చేశాడు.