హైదరాబాద్: చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఆటగాడు హషీం ఆమ్లా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోహ్లీ సేన పంజాబ్ జట్టుని బ్యాటింగ్కు ఆహ్వానించింది.
తొలుత బ్యాటింగ్కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆది నుంచి తడబడింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ను అనికేత్ చౌదరి వేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని ఆఫ్స్టంప్నకు అవతల విసరడంతో దాన్ని కట్ చేసి బౌండరీ బాదేందుకు ఆమ్లా(1) ప్రయత్నించగా బ్యాట్కు కొంచెం ఎడ్జ్ తీసుకుంది.
ఈ క్రమంలో అవుట్ కోసం బౌలర్తో పాటు కీపర్ కేదార్ జాదవ్ అప్పీల్ చేయకుండానే ఆమ్లా తనంతటతానే పెవిలియన్కు చేరాడు. దీంతో హషీం ఆమ్లా క్రీడాస్ఫూర్తిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
#IPL VIDEO: @amlahash - The Fair Play ambassador https://t.co/bMIaoUH4OK #RCBvKXIP
— IndianPremierLeague (@IPL) 5 May 2017
How many batsmen would walk without bowler appealing but that's how this guy plays his cricket @amlahash @IPL #honestman
— Irfan Pathan (@IrfanPathan) 5 May 2017
I wouldn't mind playing street cricket with Hashim Amla 😅 You don't apeal, and he walks 😎 But that's how the legend plays the game 😂 #IPL🏏 pic.twitter.com/pwWpB16UU6
— #NaeemForPresident (@NaeemHoosain) 5 May 2017
Players like Hashim Amla and MS Dhoni are the best examples of sportsmanship. #RCBvKXIP #IPL #IPL2017 pic.twitter.com/AllFDcMAYO
— CricTracker (@Cricketracker) 5 May 2017
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 19 పరుగుల తేడాతో గెలిచింది. 139 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 19 ఓవర్లలో 119 పరుగులు చేసి ఆలౌటైంది. బెంగళూరు ఆటగాళ్లలో మన్దీప్ సింగ్(46) తప్ప మిగతా ఎవరూ రాణించలేదు.
బెంగళూరు స్టార్ ఆటగాళ్లు క్రిస్ గేల్ డకౌట్ కాగా, విరాట్ కోహ్లీ 6, డివిలియర్స్ 10 పరుగులకే పెవిలియన్కు చేరారు. పంజాబ్ బౌలర్లలో సందీప్ శర్మ అక్షర్ పటేల్ చెరో మూడు వికెట్లు తీసుకోగా, మోహిత్ శర్మ, మాక్స్వెల్ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకముందు పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది.
ఓపెనర్లు హషీమ్ ఆమ్లా(1), మార్టిన్ గప్టిల్(9)లు తీవ్రంగా నిరాశపరిచారు. జట్టు స్కోరు 18 వద్ద మార్టిన్ గప్తిల్(9) వికెట్ కూడా కోల్పోవడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన షాన్ మార్ష్ (20), మనన్ వోహ్రా(25) ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. అయితే పవన్నేగి వేసిన ఏడో ఓవర్లో మార్ష్ అవుటయ్యాడు.
ఈ మ్యాచ్లో కెప్టెన్ మాక్స్వెల్ పదకొండు బంతులాడి ఆరు పరుగులు మాత్రమే చేశాడు. ఈ దశలో పంజాబ్ 13.5 ఓవర్లకే ఐదు వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న సాహా(21)ను జట్టు స్కోరు 112 వద్ద వాట్సన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత 19వ ఓవర్లో మోహిత్ శర్మ 6 పరుగుల వద్ద పెవిలియన్కు చేరాడు.
ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అక్షర్ పటేల్ (38) రెండు ఫోర్లు, సిక్సర్ బాది 19 పరుగులు రాబట్టడంతో పంజాబ్ 138 పరుగులు చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో అంకిత్ చౌదరి, చాహల్లు చెరో రెండు వికెట్లు సాధించగా, అరవింద్, షేన్ వాట్సన్, పవన్ నేగీలు తలో వికెట్ తీశారు.