
మ్యాచ్కు కాసేపు అంతరాయం
ఈ సమయంలో మ్యాచ్కు కాసేపు అంతరాయం కలిగింది. ఢిల్లీ యువ క్రికెటర్ రిషబ్ పంత్ను తన అద్భుతమైన ఆటతీరుతో రనౌట్ చేసిన తీరుపై రైనాను అభినందించేందుకు తాను మైదానంలోకి వెళ్లినట్లు మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రింకూ చెప్పాడు.

గతంలో కూడా ఇలా చేశా
గతంలో ఓ రంజీ మ్యాచ్ సందర్భంలో తన అభిమాన క్రికెటర్ను కలిశానని అతడు తెలిపాడు. ఇదిలా ఉంటే బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 2 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.

గుజరాత్పై ఢిల్లీ విజయం
అరోన్ ఫించ్ (39 బంతుల్లో 69; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) దినేశ్ కార్తీక్ (28 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఆ తర్వాత 196 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 197 పరుగులు చేసి గుజరాత్పై విజయం సాధించింది.

శ్రేయస్కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు
ఢిల్లీ యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (57 బంతుల్లో 96; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించి ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. కమిన్స్ (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో శ్రేయస్ అయ్యర్కు మద్దతుగా నిలిచాడు. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన శ్రేయస్కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.


Click it and Unblock the Notifications











