ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 9 ఆటగాళ్ల కోసం వేలం ఫిబ్రవరి 6వ తేదీన జరగనుంది. బెంగళూరులో ఈ వేలం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎంత ఖర్చు చేసింది? ఏ జట్టు వద్ద ఇంకా ఎన్ని డబ్బులు మిగిలి ఉన్నాయో ఇక్కడ చూడవచ్చు. ఓ ఫ్రాంచైజీ మొత్తంగా ఆటగాళ్ల కోసం రూ.66 కోట్లు ఖర్చు పెట్టవచ్చు.

ఢిల్లీ డేర్ డెవిల్స్: ఖర్చు చేసిన మొత్తం రూ.29.15 కోట్లు (14 క్రీడాకారులు ఉన్నారు), ఇంకా మిగిలి ఉన్న మొత్తం రూ.36.85 కోట్లు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్: ఖర్చు చేసిన మొత్తం రూ.43 కోట్లు (14 క్రీడాకారులు ఉన్నారు), ఇంకా మిగిలి ఉన్న మొత్తం రూ.23 కోట్లు
కోల్కరతా నైట్ రైడర్స్: ఖర్చు చేసిన మొత్తం రూ.48.05 కోట్లు (15 క్రీడాకారులు ఉన్నారు), ఇంకా మిగిలి ఉన్న మొత్తం రూ.17.95 కోట్లు
ముంబై ఇండియన్స్: ఖర్చు చేసిన మొత్తం రూ.51.595 కోట్లు (19 క్రీడాకారులు ఉన్నారు), ఇంకా మిగిలి ఉన్న మొత్తం రూ.14.405 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఖర్చు చేసిన మొత్తం రూ.44.375 కోట్లు (14 క్రీడాకారులు ఉన్నారు), ఇంకా మిగిలి ఉన్న మొత్తం రూ.21.625 కోట్లు
సన్ రైజర్స్ హైదరాబాద్: ఖర్చు చేసిన మొత్తం రూ.35.85 కోట్లు (15 క్రీడాకారులు ఉన్నారు), ఇంకా మిగిలి ఉన్న మొత్తం రూ.30.15 కోట్లు
టీమ్ పుణే: ఖర్చు చేసిన మొత్తం రూ.39 కోట్లు (5గురు ఆటగాళ్లను డ్రాఫ్ట్లో తీసుకుంది), ఇంకా మిగిలి ఉన్న మొత్తం రూ.27 కోట్లు
టీమ్ రాజ్కోట్: ఖర్చు చేసిన మొత్తం రూ.39 కోట్లు (5గురు ఆటగాళ్లను డ్రాఫ్ట్లో తీసుకుంది), ఇంకా మిగిలి ఉన్న మొత్తం రూ.27 కోట్లు
ఇప్పటి వరకు అన్ని జట్లు కలిపి మొత్తం చేసిన ఖర్చు రూ.330.02 కోట్లు, మిగిలి ఉన్న మొత్తం రూ.197.98 కోట్లు, ఆయా జట్లు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు మొత్తం 101, ఇందులో 37 మంది విదేశీ ఆటగాళ్లు.
ఒక్కో ఫ్రాంచైజీ రూ.66 కోట్లు ఆటగాళ్ల పైన ఖర్చు పెట్టవచ్చు. ఐపీఎల్ అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ.528 కోట్లు ఖర్చు చేయవచ్చు.