అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 8లో తొలి సూపర్ ఓవర్ మ్యాచ్ని అభిమానులు వీక్షించారు. ఐపీఎల్లో భాగంగా అహ్మదాబాద్లోని సర్ధార్ పటేల్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ Vs రాజస్ధాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ సూపర్ ఓవర్ను అభిమానులు కళ్లారా చూశారు.
సూపర్ ఓవర్:
సూపర్ ఓవర్ అనేది ఒక ఓవర్ పోటీ. ట్వంటీ20 ఫార్మెట్లో రెండు జట్లు సమానమైన స్కోరు చేస్తే మ్యాచ్ ఫలితాన్ని తేల్చడం కోసం ఈ సూపర్ ఓవర్ను ప్రవేశపెట్టారు.
ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ టోర్నమెంట్లో భాగంగా కూడా ఫైనల్ మ్యాచ్ గనుక టై అయితే మ్యాచ్ ఫలితాన్ని తేల్చడం కోసం ఈ సూపర్ ఓవర్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రవేశపెట్టింది. అయితే వరల్డ్ కప్లో ఈ సూపర్ ఓవర్ పోటీని ఉపయోగించలేదు. కారణం వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై ఆస్టేలియాల అలవోకగా విజయం సాధించడమే.

గతంలో ట్వంటీ20 మ్యాచ్ల్లో టై అయితే, బోల్ ఔట్ ద్వారా విజేతను నిర్ణయించేవారు. ఇరు జట్ల నుంచి ఐదుగురు బౌలర్లు వికెట్లకు బౌలింగ్ వేస్తారు. ఏ జట్టులో అయితే ముగ్గురు బౌలర్లు వికెట్లను పడగొడ్తారో ఆ జట్టు విజేతగా ప్రకటిస్తారు. ఈ పద్ధతిలో ఇప్పుడు సూపర్ ఓవర్ను ఐసీసీ 2008లో ప్రవేశపెట్టింది.
దక్షిణాఫ్రికాలో భారత్ గెలుచుకున్న ట్వంటీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ షిప్లో ఈ బౌల్ ఔట్ పద్ధతిని ఉపయోగించారు. ఈ టోర్నమెంట్లో భారత్ - పాకిస్ధాన్ల మధ్య జరిగిన మ్యాచ్లో బౌల్ ఔట్ని ఉపయోగించారు.
సూపర్ ఓవర్ను ఎలా ఆడతారు?
* సాధారణ ఐపీఎల్ మ్యాచ్ మాదిరే ఈ ఓవర్లో ఆటగాళ్లంతా మైదానంలో ఆడతారు. ఫీల్డింగ్ పరిమితులు కూడా ఒకేలా ఉంటాయి.
* ఏ జట్టు అయితే రెండోసారి బ్యాటింగ్ ఆడుతుందో ఆ జట్టు సూపర్ ఓవర్ను మొదట ఆడుతుంది.
* అంఫైర్లు నిర్దేశించిన బాక్సు నుంచి ఏ బౌలర్ బౌలింగ్ వేయాలో ఆ జట్టు కెప్టెన్ నిర్ణయం తీసుకుంటాడు.
* సూపర్ ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన జట్టు ఓటిమి పాలవుతుంది.
* సూపర్ ఓవర్లో ఏ జట్టు అయితే అత్యధిక పరుగులు చేస్తుందో వారే విజేతలు.
రాజస్ధాన్ రాయల్స్ Vs కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మ్యాచ్లో సూపర్ ఓవర్ ఎలా?
రాజస్ధాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సూపర్ ఓవర్లో పంజాబ్ జట్టు 9 పరుగుల తేడాతో రాజస్ధాన్ను ఓడించింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 15 పరుగులు చేయగా, ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన రాజస్దాన్ 6 పరుగులు మాత్రమే చేసింది.
సూపర్ ఓవర్లో పంజాబ్ తొలి బంతికే డేవిడ్ మిల్లర్ వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాతి 5 బంతుల్లో 15 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన రాజస్ధాన్ తొలి బంతికే వాట్సన్ ఔట్ అవగా, మూడో బంతికి ఫల్కనర్ రనౌట్ అయ్యాడు. సూపర్ ఓవర్ రూల్ ప్రకారం రెండు వికెట్లు పడితే ఆ జట్టు ఓటమి పాలవుతుంది. దీంతో అంఫైర్లు పంజాబ్ను విజేతగా ప్రకటించారు.