ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడేందుకు కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టుకు చెందిన స్ఫిన్నర్ సునీల్ నరేన్కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చి మరీ బీసీసీఐ గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. అంతక ముందు సునీల్ నరైన్ ఆఫ్ స్నిన్ బౌలింగుపై బిసిసిఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
బీసీసీఐ నిషేధం తర్వాత చెన్నైలో తాజాగా బౌలింగ్ పరీక్షకు సునీల్ నరేన్ హాజరయ్యాడు. స్ధానిక శ్రీరామచంద్ర ఆర్ధోస్కోపి కేంద్రంలో నరేన్ సవరించిన బౌలింగ్ యాక్షన్ను పరీక్షించుకున్నాడు. బీసీసీఐ సస్పెక్ట్ బౌలింగ్ యాక్షన్ కమిటీ సునీల్ నరేన్కు ఆఫ్ స్ఫిన్ బౌలింగ్ వేసేందుకు అనుమతిచ్చింది.
దీంతో కోల్కత్తా జట్టులో మళ్లీ సునీల్ నరేన్ బౌలింగ్ను అభిమానులు వీక్షించొచ్చు. ఒకవేళ మ్యాచ్లో తిరిగి అంఫైర్లు నరేన్ బౌలింగ్పై ఏమైనా అనుమానులు లేవనెత్తితే, ఐపీఎల్ టోర్నమెంట్ నుంచే అతడిని పూర్తిగా నిషేధిస్తామని బీసీసీఐ సస్పెక్ట్ బౌలింగ్ యాక్షన్ కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది.
బిసిసిఐ నిర్వహించే ఐపియల్ సహా అన్ని మ్యాచుల్లోనూ నరైన్ ఆఫ్ స్పిన్నర్స్ వేసేందుకు కమిటీ అనుమతిచ్చింది. ఇతర డెలివరీలను కూడా బౌల్ చేయడానికి అవకాశం ఉంది. నుకల్, క్వికర్ స్ట్రెయిట్ బంతులు వేయవచ్చుని బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ గురువారం మీడియాకు తెలియజేశారు.
కమిటీ నివేదించిన నివేదిక ప్రకారం సునీల్ నరేన్ బౌలింగ్ యాక్షన్ క్లీన్గా ఉందన్నారు. బౌలింగ్ యాక్షన్ బయోమెకానికల్ అనాలిసిస్ కోసం నరైన్ చెన్నైలోని శ్రీ రామచంద్ర అర్ణ్రోస్కోపీ, స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ను సునీల్ నరేన్ వెళ్లడం జరిగిందని అన్నారు.
ఈ అనాలసిస్లో నరైన్ ఆప్ స్నిన్నర్ బంతులు వేస్తే అంపైర్లు 24.3 క్లాజు కింద ఉన్నాయని తెలిపారు. గత ఏడాది కూడా అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20 నుంచి సునీల్ నరేన్ని నిషేధించిన సంగతి తెలిసిందే.