హైదరాబాద్: ఐపీఎల్లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ మార్ష్ తొమ్మిది నెలలు క్రికెట్కు దూరం కానున్నాడు. భుజం గాయం కారణంగా భారత్తో జరుగుతున్న టెస్టు సిరిస్ నుంచి మధ్యలోనే వైదొలగిన సంగతి తెలిసిందే.
ఆసీస్కు మరో ఎదురుదెబ్బ: మిగతా రెండు టెస్టులకు మార్ష్ దూరం
బెంగుళూరు టెస్టులో గాయపడిన మార్ష్ మెరుగైన చికిత్స కోసం స్వదేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే. మార్ష్కు ఆపరేషన్ అనివార్యం కావడంతో స్వదేశంలో ఇంగ్లాండ్తో జరగనున్న యాషెస్ సిరిస్కు అతను అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. అయితే వచ్చే వారంలో వైద్యనిపుణలను మార్ష్ సంప్రదించే అవకాశముంది.
ఆపరేషన్ గనుక అవసరమైతే దాదాపు 9 నెలల పాటు క్రికెట్కు దూరం కావాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఐపీఎల్ 10వ సీజన్కు కూడా మార్ష్ దూరం కానున్నాడు. గత సీజన్లో అతను పుణెకు ప్రాతినిధ్యం వహించాడు. 2009లో కూడా మిచెల్ మార్ష్ ఇదే కారణంతో కొన్నాళ్లు క్రికెట్కు దూరమైన సంగతి తెలిసిందే. మార్ష్కు అయిన గాయం తీవ్రతపై సోమవారం క్రికెట్ ఆస్ట్రేలియా కూడా తన అధికారిక ట్విట్టర్లో స్పందించింది.
Mitch Marsh faces lengthy injury spell: report: https://t.co/uz3PGOVUwY pic.twitter.com/48pNr98YgR
— cricket.com.au (@CricketAus) 13 March 2017
అంతక ముందు భుజం గాయం కారణంగా మిచెల్ మార్ష్ మిగతా రెండు టెస్టులకు దూరమవుతున్నట్లు ఆసీస్ ఫిజియోథెరపిస్టు డేవిడ్ తెలిపారు. 'కొంతకాలంగా మిచెల్ మార్ష్ భుజం గాయంతో బాధ పడుతున్నాడు. సమ్మర్ సీజన్ లో చాలా వరకు ఇలానే ఆడాడు. ఇప్పటివరకు ఇలాగే మేనేజ్ చేశాం. గాయం ఎక్కువకావడంతో అతడు ఆడలేకపోతున్నాడు'అని ఆయన అన్నారు.