మెరిసిన షఫాలీ:
వర్షం కారణంగా మైదానం చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ నిర్ణీత సమయం కంటే అరగంట ఆలస్యంగా ప్రారంభమవడంతో 17 ఓవర్లకు కుదించారు. మొదట టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 17 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. భారత్కుమంచి శుభారంభం దక్కింది. అరంగేట్రం మ్యాచ్లో డకౌటై నిరాశపరిచిన షఫాలీ వర్మ (33 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తన రెండో మ్యాచ్లో ఆకట్టుకుంది. బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఈ క్రమంలోనే స్మృతి మందన (13)తో కలిసి తొలి వికెట్కు 52 పరుగులు జోడించింది.
మంధాన విఫలం:
మరోవైపు మంధాన తనకు రెండు సార్లు లైఫ్ లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. షఫాలీ అర్ధ సెంచరీకి దగ్గరగా ఉండగా.. సెఖుఖునే క్లీన్బౌల్డ్ చేసింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ (16; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగింది. ఆ తర్వాత దీప్తి శర్మ (20).. జెమీమాకు సహకారం అందించడంతో భారత్ మంచి స్కోరు చేసింది.
స్పీన్ దాటికి నిలవలేక:
లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 17 ఓవర్లలో 7 వికెట్లకు 89 పరుగులే చేయగలిగింది. ప్రొటీస్ స్పిన్ బలహీనతను భారత స్పిన్నర్లు ఉపయోగించుకున్నారు. ఆఫ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ (3/13), లెగ్ స్పిన్నర్ రాధా యాదవ్ (2/16) దెబ్బకు ప్రొటీస్ బ్యాట్స్వుమెన్ క్రీజులో నిలబడలేకపోయారు. 23 పరుగుల చేసిన లారా వోల్వార్ట్నే టాప్ స్కోరర్. ఓపెనర్ బ్రిట్స్ (20) మినహా అందరూ సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరారు. దక్షిణాఫ్రికా ఏ దశలోనూ టార్గెట్ ఛేజ్ చేసేలా కనిపించలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. నామమాత్రమైన చివర టీ20 శుక్రవారం జరగనుంది.