న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విశాఖకు దక్షిణాఫ్రికా జట్టు: గురువారం నుంచి బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌‌తో వార్మప్ మ్యాచ్

 Indisa vs South Africa: South Africa team reaches visakhapatnam


హైదరాబాద్:
మూడు టీ20లు, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడేందుకు గాను దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈ పర్యటనలో మూడు టీ20ల సిరిస్ ముగిసింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా... ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ నెగ్గడంతో సిరిస్ 1-1తో సమం అయింది.

ఇప్పుడు టెస్టు సిరిస్ వంతు వచ్చింది. ఆక్టోబర్ 2 నుంచి జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌కు విశాఖపట్నం ఆతిథ్యమిస్తోంది. దీంతో మూడో టీ20 ముగిసిన వెంటనే దక్షిణాఫ్రికా జట్టు విశాఖపట్నానికి చేరుకుంది. దక్షిణాఫ్రికా జట్టుతో పాటు బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ జట్టు కూడా విశాఖకు చేరుకుంది.

<strong>వైరల్ ఫొటో.. బికినీలో పిచ్చెక్కిస్తున్న ధోనీ మాజీ గర్ల్ ఫ్రెండ్</strong>వైరల్ ఫొటో.. బికినీలో పిచ్చెక్కిస్తున్న ధోనీ మాజీ గర్ల్ ఫ్రెండ్

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు ముందు దక్షిణాఫ్రికా జట్టు బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ జట్టుతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. గురువారం నుంచి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి వీసీఏ-ఏడీసీఏ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు విశాఖకు చేరుకున్నారు.

విశాఖకు చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టుకు ఘన స్వాగతం లభించింది. బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ జట్టుతో వార్మప్ మ్యాచ్ అనంతరం భారత్‌-దక్షిణాఫ్రికా జట్లు విశాఖపట్నం వేదికగా అక్టోబర్‌ 2న తొలి టెస్టు మ్యాచ్‌లో తలపడతాయి. 2015లో భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా జట్టు నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో చేజార్చుకుంది.

Story first published: Monday, September 23, 2019, 17:10 [IST]
Other articles published on Sep 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X