పెర్త్: వెస్టర్న్ ఆస్ట్రేలియా-11(డబ్ల్యూఏ-11)తో పెర్త్ వేదికగా శుక్రవారం జరిగిన సన్నాహక టీ20 మ్యాచ్లో 74 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ మహేంద్ర సింద్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఓపెనర్ రోహిత్ శర్మ 6 పరుగులకే ఔటౌ నిరాశపరిచినా.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 45 బంత్తుల్లో 74(8ఫోర్లు, 3సిక్స్లు), విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 74(7ఫోర్లు, 3సిక్స్లు) అర్ధ శతకాలతో సత్తా చాటారు.

చివర్లో ధోనీ కూడా 14 బంతుల్లో 22 పరుగు(ఒక ఫోర్, 2సిక్స్)లతో రాణించడంతో భారత్ 193 పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్టర్న్ ఆస్ట్రేలియాకు నిర్దేశించింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి పరాజయం పాలైంది. టిఆర్ 74 పరుగులతో రాణించినప్పటికీ మిగితా ఆటగాళ్లు విఫమవడంతో ఈ జట్టుకు ఓటమి తప్పలేదు. కాగా, ఆస్ట్రేలియా ప్రధాన జట్టు బిగ్బాష్ టీ20 లీగ్లో ఆడుతుంటడంతో ద్వితీయ శ్రేణి జట్టు భారత్తో తలపడింది.