హైదరాబాద్: టీమిండియా బౌలింగ్ కోచ్గా వ్యవహరిస్తున్న భరత్ అరుణ్లాగే భారత మహిళా క్రికెట్కు కూడా బౌలింగ్ కోచ్ కావాలంటూ బీసీసీఐ ప్రకటన జారీ చేసింది. 'బీసీసీఐ త్వరలో ప్రకటన విడుదల చేసి దరఖాస్తులు ఆహ్వానించాలని చూస్తోంది' అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. మహిళా క్రికెటర్ల జట్టుకు తుషార్ అర్థో జట్టుకు ప్రధాన కోచ్గా, బిజు జార్జ్ ఫీల్డింగ్ కోచ్గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.
'టీమిండియా తరఫున ఆడిన వారే ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని లేదు. తుషార్కు భారత జట్టులో ఆడిన అనుభవం లేదు' అని బీసీసీఐ అధికారి తెలిపారు. మరికొద్ది రోజుల్లో ఆసియా కప్లో ఆడే భారత జట్టు బృందాన్ని ఎంపిక చేసి ప్రకటిస్తామని ఆయన చెప్పారు. మిథాలీ సేన భవిష్యత్తులో ఆడే టోర్నీలను దృష్టిలో పెట్టుకుని కూడా బీసీసీఐ ఫీల్డింగ్ కోచ్ ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని భావిస్తోంది.
BCCI to appoint bowling coach for India women’s team CrickbuzzLive https://t.co/uTiaZdBMSj pic.twitter.com/w7sHdfsKcm
— Soniya (@iam_soniyaa) April 26, 2018
బరోడా మాజీ ప్లేయర్ అయిన తుషార్ అర్థో ప్రస్తుతం భారత మహిళా జట్టుకు ప్రధాన కోచ్గా బాధ్యతలు వహిస్తున్నారు. ఆవిడ ఖాతాలో.. 6105పరుగులు, 225 వికెట్ల స్కోరు ఉంది. ఇక బిజూ జార్జ్ ఫీల్డింగ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ల్లో భారత జట్టులో బౌలింగ్ లోపాలు బాగా కనిపించాయి. రానున్న ఆసియా కప్ సమయానికి భారత మహిళా జట్టును పటిష్టం చేయాలని బీసీసీఐ భావిస్తోంది.
గతేడాది జరిగిన ఇంగ్లాండ్లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ప్రత్యర్థి జట్టు పరుగులను కట్టడి చేయలేకపోయింది. ఇటీవలే ముంబై వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ఛాంపియన్ షిప్ లోనూ సిరీస్ ను కోల్పోయిన మిథాలీ సేన ప్రధాన లోపం బౌలింగ్దే అన్నట్లు కనిపించింది. మార్చి నెలలో జరిగిన మ్యాచ్లోనూ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ లలోనూ పరాజయం పాలైంది.