
బ్యాటింగ్లో రాణిస్తే
"బంగ్లాదేశ్ బ్యాటింగ్లో రాణిస్తే భారత్కు గట్టి పోటీ ఇస్తుంది. బంగ్లాదేశ్కు బలహీనం ఏదైనా ఉందంటే అది బౌలింగ్లోనే. బంగ్లా బౌలింగ్ విభాగంలో ముస్తాఫిజుర్ రెహ్మాన్పై ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే స్పిన్ విభాగంలో ఆ జట్టు బలంగా లేదు కాబట్టి... ముస్తాఫిజుర్ కొత్త బంతితో ఆరంభంలో వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది" అని లక్ష్మణ్ అన్నాడు.

భారత జట్టులో విరాట్ కోహ్లీ లేడు
"భారత జట్టులో విరాట్ కోహ్లీ లేడు. దీంతో మిడిల్ ఆర్డర్లో భారత్ జట్టు అనుభవ లేమి కనబడుతోంది. ఇక భారత్ విజయాల్లో ముఖ్య భూమిక పోషించడానికి యువ క్రికెటర్లు సిద్ధం కావాలి. వాషింగ్టన్ సుందర్, చహల్లు భారత బౌలింగ్ యూనిట్లో కీలకం కానున్నారు. టీ20 సిరీస్కు సన్నద్ధమైన వేదికలు స్పిన్కు ఎక్కువ అనుకూలించే అవకాశాలున్నాయి" అని లక్ష్మణ్ తెలిపాడు.

అనుభవరాహిత్యం ఉంది
"ప్రస్తుతం బౌలింగ్ లైనప్లో చాలా అనుభవరాహిత్యం ఉంది కాబట్టి యుజువేంద్ర చాహల్ మూడు మ్యాచ్లు ఆడతారని ఆశిస్తున్నాను. కృనాల్ పాండ్యా వంటి యువ క్రికెటర్లకు ఇదొక మంచి అవకాశం. భారత్ 2-1 తేడాతో గెలుస్తుందనే అనుకుంటున్నా" అని వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు.

జట్టులో అందరూ యువ క్రికెటర్లే
"భారత జట్టులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్లు తప్పిస్తే మిగతా వారంతా దాదాపు యువ క్రికెటర్లే. సిరీస్ గెలవడానికి నేను భారత బ్యాటింగ్ పవర్కే మద్దతు ఇస్తున్నాను" అని లక్ష్మణ్ అన్నాడు. ఈ సిరీస్లో పలువురు సీనియర్ క్రికెటర్లకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.

కోహ్లీకి విశ్రాంతి... కెప్టెన్గా రోహిత్ శర్మ
వరల్డ్కప్ తర్వాత నుంచి విరాట్ కోహ్లీ విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో సెలక్టర్లు అతడికి విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు కెప్టెన్గా వ్యవహారించనున్నాడు. టీ20 సిరిస్ అనంతరం రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్కు తిరిగి కోహ్లీ నాయకత్వం వహించనున్నాడు.


Click it and Unblock the Notifications
