
కోహ్లీ ఛారిటీ ఈవెంట్లో విజయ్ మాల్యా
దీంతో ఎటువంటి వివాదానికి తావివ్వకుండా త్వరితగతిన కార్యక్రమాన్ని ముగించుకుని అక్కడి నుంచి వచ్చేశారు. టీమిండియా హాజరైన కార్యక్రమానికి విజయ్ మాల్యా హాజరవడంపై సోషల్ మీడియా నెజిటన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీకి సంబంధించి బీసీసీఐ వివరణ ఇచ్చింది.

బీసీసీఐ వివరణ
'చూడండి. కోహ్లీ కానీ, అతని ఫౌండేషన్ కానీ మాల్యాను ఈ ఈవెంట్కు ఆహ్వానించలేదు. చారిటీ డిన్నర్లో టేబుల్ను ఎవరైతే బుక్ చేసుకుంటారో... వాళ్లు ఆహ్వానించి ఉండొచ్చు. టీమిండియా మాల్యాతో ఎలాంటి స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించబోదు' అని ఈ కార్యక్రమానికి హాజరైన బీసీసీఐ అధికార ప్రతినిధి చెప్పారు.

అందుకు కారణం విజయ్ మాల్యా
అంతేకాదు టీమిండియా వెంటనే ఇంటి దారి పట్టడానికి మాల్యా కూడా ఒక కారణమని ఆయన పేర్కొన్నారు. మాల్యా రాకతో ఆటగాళ్లు చాలా ఇబ్బందిగా ఫీలయ్యారని బీసీసీఐ వెల్లడించింది. కాగా, ఈ ఛారిటీ ఈవెంట్ని అలాన్ విల్కిన్స్ నిర్వహించాడు. ఈ కార్యక్రమం వ్యాఖ్యతగా ఐర్లాండ్ అంతర్జాతీయ క్రికెటర్ నిఆల్ ఓ బ్రెయిన్ వ్యవహరించారు.

భారత్-పాక్ మ్యాచ్లో సైతం
బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశంలో విలాసవంతమైన జీవితం గడుపుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా గత ఆదివారం ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన భారత్-పాక్ మ్యాచ్లో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్కి విజయ్ మాల్యా హాజరు కావడం జాతీయ మీడియాలో పెద్ద సెన్సేషన్ న్యూస్ అయింది.

కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించిన మాల్యా
తాజా ప్రచారంపై విజయ్ మాల్యా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఎడ్జిబాస్టన్లో పాక్తో జరిగిన మ్యాచ్కు తాను రావడంపై మీడియా కవరేజి సెన్సేషనల్గా ఉందని, అయితే తాను మొత్తం అన్ని మ్యాచ్లకు వచ్చి భారత జట్టును అలరిస్తానని ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాల్యా ప్రశంసల్లో ముంచెత్తాడు.


Click it and Unblock the Notifications











