కోల్కతా: టీమిండియా క్రికెటర్ మొహమ్మద్ షమీకి మరోసారి కోల్కతా కోర్టు సమన్లు జారీ చేసింది. జనవరి 15లోపు ప్రత్యక్షంగా హాజరు కాకుంటే అరెస్టు వారెంట్ జారీ చేస్తామని స్థానిక కోర్టు హెచ్చరించింది. షమీ భార్య హాసిన్ జహాన్ తన భర్త షమీ ఇచ్చిన చెక్కు బౌన్స్ అయిందని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అలిపోర్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎండీ జాఫర్ పర్వేజ్ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
షమి, హసీన్ జహాన్ వివాహ బంధం బీటలు వారిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకోనున్నారు. గొడవల కారణంగా చాలారోజుల నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. హసీన్ నెలవారీ ఖర్చుల నిమిత్తం ప్రతినెలా చెక్కు పంపిస్తున్న షమి ఈ సారి పంపిన చెక్కు బౌన్స్ అయింది. షమి కావాలనే ఆపాడని హసీన్ ఎన్ఐ చట్టం కింద కేసు పెట్టింది.
మ్యాచ్ గెలిస్తే.. సెమీస్కే.. హర్మన్ మరోసారి రెచ్చిపోతే!!
ఈ కేసులో భాగంగా షమి అక్టోబర్లోనే కోర్టుకు రావాల్సి ఉంది. ఆ నెలలో గైర్హాజరీతో పాటు బుధవారం జరిగిన విచారణకూ హాజరు కాకపోవడంతో ఆగ్రహించిన న్యాయమూర్తి జనవరి 15న ప్రత్యక్షంగా హాజరుకాకుంటే అరెస్టు వారెంటు జారీ చేస్తామని హెచ్చరించారు. దీంతో షమి తరఫున న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని అతడి లాయర్ సలీమ్ రెహమాన్ న్యాయమూర్తిని కోరారు.
షమీ కోర్టుకు హాజరు కాకుంటే అరెస్టు వారెంటు జారీ చేస్తామని కోర్టు సమన్లలో పేర్కొంది. క్రికెటర్ షమీపై అతని భార్య వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని ఆరోపించింది. తనపై షమీ సోదరుడు అత్యాచారానికి యత్నించాడంటూ పలు ఆరోపణలు చేసింది.