
మీడియాలో వైరల్
ఇది ఇలా ఉంటే టీ20 వరల్డ్ కప్లో భాగంగా 23న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు టిమీండియా బౌలర్ మహ్మద్ షమీ, పాక్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిదీ ప్రాక్టీస్ సెషన్ లో కలిశారు. షమీ ఆఫ్రిదీతో చిట్కాలను పంచుకోవడం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పెద్ద అభిమాని
"జబ్ సే మైనే బౌలింగ్ ప్రారంభం కరీ హై తబ్సే మై ఆప్ కో ఫాలో కర్ రహా హు, ఔర్ సీమ్ కా జవాబ్ నహీ హై (నేను బౌలింగ్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి నేను నిన్ను అనుసరిస్తున్నాను. అప్పటి నుంచి నేను మీ మణికట్టుకు పెద్ద అభిమానిని. మీది నిటారుగా ఉండే సీమ్" అని షాహీన్ షా షమీతో అన్నాడు. "అగర్ రిలీజ్ పాయింట్ అచా హో జాయేగా నా సీమ్ భీ థీక్ హో జాయేగా (రిలీజ్ పాయింట్ పాయింట్లో ఉంటే, అప్పుడు సీమ్ ఆటోమేటిక్గా బాగుంటుంది)" అని షమీ బదులిచ్చాడు.
మూడు వికెట్లు
ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో మహ్మద్ షమీ చివరి ఓవరులో మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ టీ20 వరల్డ్ కప్ కు మహ్మద్ షమీ ఎంపిక కాలేదు. బుమ్రా గాయపడడంతో అతని స్థానంలో మహ్మద్ షమీ జట్టులోకి వచ్చాడు.


Click it and Unblock the Notifications
