IND vs ENG: భారత జట్టు ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు భారత స్టార్ క్రికెటర్ ప్రియాంక్ పంచల్ మూడు ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. దేశవాళీ క్రికెట్లో చాలా పరుగులు చేసిన ప్రియాంక్ ఇకపై గుజరాత్ తరఫున ఆడలేడు. ప్రియాంక్ పంచల్కు భారత టెస్ట్ జట్టులో చేరే అవకాశం చాలా సార్లు లభించింది. కానీ ప్రియాంక్ ఎప్పుడూ భారత ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే ఇప్పుడు ప్రియాంక్ పంచల్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.
ప్రియాంక్కు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ నుంచి అభినందనలు
ప్రియాంక్ పంచల్ రిటైర్మెంట్ తర్వాత గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కూడా అతడిని అభినందించింది. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 29 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు సాధించాడు. ప్రియాంక్ పంచల్ 2016-17లో గుజరాత్ జట్టుకు తొలి రంజీ ట్రోఫీ టైటిల్ను అందించాడు. విజయ్ హజారే ట్రోఫీ(2015-16), సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ(2012-13, 2013-14)లను కూడా గెలుచుకున్నాడు. ఎన్నో విజయాలు సాధించినందుకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అతడిని అభినందించింది.

ప్రియాంక్ పంచల్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్ను 2008లో ప్రారంభించాడు. దాదాపు 17 సంవత్సరాలు గుజరాత్కు ప్రాతినిధ్యం వహించిన తర్వాత ప్రియాంక్ పంచల్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ప్రియాంక్ గుజరాత్ తరఫున అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకడు. ప్రియాంక్ పంచల్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. తన 17 ఏళ్ల కెరీర్లో ప్రియాంక్ 127 ఫస్ట్-క్లాస్ మ్యాచ్ల్లో 8856 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
తన లిస్ట్ ఏ కెరీర్ గురించి చెప్పాలంటే ప్రియాంక్ 40.80 సగటుతో 3672 పరుగులు చేశాడు. ఈ కాలంలో 8 సెంచరీలు కాకుండా 21 అర్థ సెంచరీలు ప్రియాంక్ బ్యాట్ నుంచి వచ్చాయి. 59 టీ20 మ్యాచ్ల్లో ఈ ఆటగాడు 28.71 సగటుతో 1522 పరుగులు చేశాడు. అయితే ఇప్పుడు 35 సంవత్సరాల వయస్సులో తన రిటైర్మెంట్ ప్రకటించాడు.