2020 నుంచి ఇంగ్లాండ్లో 100 బంతుల ఫార్మాట్
2020 నుంచి ఇంగ్లాండ్లో మొదలయ్యే ఈ 100 బంతుల ఫార్మాట్ టోర్నమెంట్లో మాత్రం టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ధోనీలాంటి స్టార్ ప్లేయర్లు కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. నిజానికి ఐపీఎల్ను కాపాడుకోవడానికి బీసీసీఐ తమ ఆటగాళ్లను విదేశీ లీగ్లలో ఆడేందుకు అనుమతి ఇవ్వడం లేదు.
120 బంతులకు బదులు 100 బంతులు మాత్రమే
కానీ, ఈ బంతుల ఫార్మాట్ విషయంలో మాత్రం బోర్డు కాస్త వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది 120 బంతులకు బదులు 100 బంతులు మాత్రమే ఆడే టోర్నీ. ఒక్కో ఇన్నింగ్స్లో వంద బంతులు మాత్రమే ఉండటం ఈ టోర్నీ ప్రత్యేకత అని డైలీ మెయిల్ ఓ వార్తా కథనంలో రాసుకొచ్చింది.
టోర్నీకి మంచి ఆదరణ దక్కుతుందని డైలీ మెయిల్ కథనం
విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మలాంటి ప్లేయర్స్ తొలి సీజన్లోనే ఆడితే ఈ టోర్నీకి మంచి ఆదరణ దక్కుతుందని డైలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. ఐపీఎల్ తొలి సీజన్లలో తమ ఆటగాళ్లను పంపడానికి అంతగా ఇష్టపడని ఇంగ్లాండ్ అండే వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆ తర్వాత చాలా మందికి అనుమతి ఇచ్చింది.
100 బంతుల ఇన్నింగ్స్ ఇలా:
ఈ ప్రతిపాదన ప్రకారం 15 ఓవర్ల వరకు ఓవర్కు ఆరు బంతులు వేయించి, పది బంతులతో చివరి ఓవర్ ఉండేలా ఈ కొత్త ఫార్మాట్ను ఇంగ్లాండ్ అండే వేల్స్ క్రికెట్ బోర్డు రూపొందించింది. అంతేకాదు 2020లో ఎనిమిది జట్లతో ఈ ఫార్మాట్లో టోర్నీ ఆడించడానికి ఇంగ్లాండ్ బోర్డు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టింది.