
భారత్ కెప్టెన్ రోహిత శర్మ మళ్లీ నిరాశ పరిచాడు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా అడిలైడ్ లోని ఓవల్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. 8 బంతుల్లో 2 పరుగులు చేసి హసన్ మహమూద్ బౌలింగ్ లో యాసిర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే అప్పటికే రోహిత్ శర్మ క్యాచ్ ను బంగ్లా ఫీల్డర్లు మిస్ చేశారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన రోహిత్ మళ్లీ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.రోహిత్ గత మూడు మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేశాడు.
పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 7 బంతుల్లో 4 పరుగులకే చేశాడు. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 39 బంతుల్లో 3 సిక్స్ లు, 4 ఫోర్లతో 53 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 15 పరుగులే చేశాడు. కాగా వరుసగా విఫలమవుతూ వస్తున్న కేఎల్ రాహుల్ బంగ్లాతో మ్యాచ్ లో హాప్ సెంచరీ చేశాడు. 32 బంతుల్లో 4 సిక్స్ లు, 3 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ గత మ్యాచ్ ల్లో తక్కువ పరుగులకే ఔటయ్యాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 9 పరుగులకే పెవిలియన్ చేరాడు.