రియో డీ జనిరో : రియో ఒలింపిక్స్ లో భారత ప్రాతినిధ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు నిరాశపరుస్తున్నారన్న వార్తలపై స్పందించిన సచిన్.. తన వ్యాఖ్యలతో అథ్లెట్లకు బాసటగా నిలిచాడు.
భారత క్రీడాకారులకు సరైనంత మద్దతు కావాలని, వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు సచిన్. అలాగే అథ్లెట్లు కూడా తమను తాము ప్రోత్సహించుకుని మంచి ప్రదర్శనతో రాణించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అన్ని సందర్బాల్లోను అనుకున్నవన్నీ జరగవని, ప్లాన్ ఒకలా ఉంటే ఫలితం మరోలా ఉండడం అప్పుడప్పుడు జరుగుతుంటాయని వ్యాఖ్యానించారు సచిన్.

ఒలింపిక్స్ లో పతకాలు సాధించడం కష్టమైనప్పటికీ.. భారత అథ్లెట్లంతా చాలానే చెమటోడుస్తున్నారని సచిన్ అభిప్రాయపడ్డారు. రియోలో భారత అథ్లెట్లు సరైన ప్రదర్శన ఇవ్వట్లేదన్న వ్యాఖ్యలను ఈ సందర్బంగా సచిన్ తప్పుబట్టాడు.