
మహిళ ఆసియా కప్ లో భారత్ ఫైనల్ కు దూసుకెళ్లింది. థాయ్లాండ్పై 74 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. ఓపెనర్ సఫాలి వర్మ 28 బంతుల్లో ఒక సిక్స్, ఐదు ఫోర్లతో 42 పరుగులు చేసింది.
హర్మన్ప్రీత్ కౌర్
కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 30 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసింది. రోడ్రిగ్స్ 27, పూజా వస్త్రాకర్ 17, స్మృతి మందన 13 పరుగులు చేసింది. థాయ్ లాండ్ బౌలర్లలో టిప్పోచ్ 3 వికెట్లు పడగొట్టగా..
బూచతం, ఫన్నిత మాయ, తిపట్చా పుట్టావోంగ్ తలో వికెట్ తీశారు. 149 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాంటింగ్ కు దిగిన థాయ్ లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లో కోల్పోయి 74 పరుగులు మాత్రమే చేసింది.
పాకిస్తానా.. శ్రీలంక
కెప్టెన్ నరుఎమోల్ చైవాయి 21 పరుగులు చేయగా.. నత్తయ బూచతం 21 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 4 ఓవర్లలో ఏడు పరుగులిచ్చి మూడు వికెట్లు తీసింది. రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లు పడగొట్టగా.. రేణుక సింగ్, రానా, షఫాలి వర్మ తలో వికెట్ తీశారు. భారత్ ఫైనల్ లో పాకిస్థాన్ లేదా శ్రీలంకతో తలపడే అవకాశం ఉంది.