Women Tri Series: శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్లో భారత మహిళల క్రికెట్ జట్టు తొలి పరాజయాన్ని మూటగట్టుకుంది. శ్రీలంక జట్టు భారత జట్టును 3 వికెట్ల తేడాతో ఓడించి రెండో విజయాన్ని నమోదు చేసింది. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్లోశ్రీలంక జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. మొదట బ్యాటింగ్ చేసి భారత్ 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. భారత జట్టు తరఫున రిచా ఘోష్ 48 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేసింది. హర్మన్ప్రీత్ కౌర్(30), ప్రతీకా రావల్(35), జెమీమా రోడ్రిగ్స్(37) పరుగులతో రాణించారు.
శ్రీలంక బౌలర్లలో సుగంధికా కుమారి, కెప్టెన్ చమరి ఆటపట్టు చెరో 3 వికెట్లు తీశారు. దీనికి సమాధానంగా శ్రీలంక 49.1 ఓవర్లలో 7 వికెట్లకు 278 పరుగులు చేసి లక్ష్యాన్ని చేరుకుంది. నీలాక్షి డి సిల్వా 56, హర్షిత సమరవిక్రమ 53 పరుగులతో రాణించారు. భారత ఆఫ్ స్పిన్నర్ 3 వికెట్లు పడగొట్టింది. వన్డేలలో శ్రీలంక రెండో అత్యధిక పరుగుల వేటను విజయవంతంగా చేసింది.

ఇప్పటివరకు ముక్కోణపు సిరీస్లో టీమిండియా ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఆ జట్టు గత 2 మ్యాచ్ల్లో గెలిచింది. ఈ సిరీస్లో భారత మహిళల జట్టు తొలి మ్యాచ్ లో శ్రీలంకను ఎదుర్కొంది. ఈ మ్యాచ్ లో భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ 39 ఓవర్లు ఆడారు. దీని తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికాను 15 పరుగుల తేడాతో ఓడించింది. భారత్ తన చివరి మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ మే 7న కొలంబోలో జరుగుతుంది. ఈ సిరీస్ లోని చివరి మ్యాచ్ మే 11న జరుగుతుంది.