For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Women Tri Series 2025: శ్రీలంక చిత్తు.. ముక్కోణపు సిరీస్ టీమిండియాదే..

Women Tri Series 2025: ముక్కోణపు సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకను 97 పరుగుల తేడాతో ఓడించి టీమిండియా ఘనవిజయం సాధించింది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. స్మృతి మంధాన సెంచరీతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా శ్రీలంక జట్టు 48.2 ఓవర్లలో 245 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ చమరి ఆటపట్టు 51 పరుగులతో అత్యధిక ఇన్నింగ్స్ ఆడింది. భారత్ తరఫున స్నేహ్ రాణా 4 వికెట్లు, అమన్‌జోత్ కౌర్ 3 వికెట్లు పడగొట్టారు. ఈ సిరీస్‌లో మూడో జట్టు దక్షిణాఫ్రికా ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.

భారత ఇన్నింగ్స్ ఇలా..

టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 342 పరుగులు చేసింది. ప్రతీకా రావల్ రూపంలో టీమిండియాకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతీకా రావల్ 49 బంతుల్లో రెండు ఫోర్లతో 30 పరుగులు చేసి ఔట్ అయింది. స్మృతి మంధానతో కలిసి తొలి వికెట్‌కు రావల్ 89 బంతుల్లో 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆ తర్వాత స్మృతి మంధాన, హర్లీన్ డియోల్ రెండో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంతలో మంధాన తన వన్డే కెరీర్‌లో 11వ సెంచరీని పూర్తి చేసుకుంది. ఆమె 101 బంతుల్లో 15 ఫోర్లు, రెండు సిక్సర్లతో 116 పరుగులు చేసింది. కాగా, హర్లీన్ డియోల్ 56 బంతుల్లో నాలుగు ఫోర్ల సహాయంతో 47 పరుగులు చేయగలిగింది. దీని తర్వాత, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ మధ్య 48 పరుగుల భాగస్వామ్యం ఉంది. హర్మన్‌ప్రీత్ 30 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 41 పరుగులు చేయగా, జెమీమా 29 బంతుల్లో నాలుగు ఫోర్లతో 44 పరుగులు చేసింది. రిచా ఘోష్ ఎనిమిది పరుగులు చేసి అవుట్ కాగా, అమన్‌జోత్ కౌర్ 18 పరుగులు చేసి అవుట్ అయింది. దీప్తి శర్మ 20 పరుగులు చేసి నాటౌట్‌గా తిరిగి వచ్చింది. క్రాంతి గౌడ్ ఖాతా తెరవకుండానే నాటౌట్‌గా తిరిగి వచ్చింది. శ్రీలంకకు చెందిన మల్కీ మదార, సుగందిక కుమారి, దేవ్మీ విహంగ చెరో రెండు వికెట్లు తీశారు. ఇనోకా రణవీర ఒక వికెట్ పడగొట్టింది.

India Wins Women Tri Series 2025 Smriti Mandhana s Century Shines in Final

శ్రీలంక ఇన్నింగ్స్
లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు ప్రారంభంలోనే నిరాశకు గురైంది. అమన్‌జోత్ కౌర్ తొలి ఓవర్‌లోనే హాసిని పెరీరాను బౌల్డ్ చేసింది. హాసిని పెరీరా కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. అయితే అనంతరం శ్రీలంక కాస్త కోలుకున్నట్లు కనిపించింది.విష్మి గుణరత్నే, చమరి ఆటపట్టు ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. అమన్‌జోత్ తన బౌలింగ్‌తో విధ్వంసం సృష్టించింది. ఇద్దరు బ్యాటర్లను అవుట్ చేసింది. విష్మి గుణరత్నే 36 పరుగులు చేసి ఔట్ కాగా, చమరి ఆటపట్టు 51 పరుగులు చేసి ఔట్ అయింది. వీరితో పాటు నీలక్షిక సిల్వా 48, హర్షిత సమరవిక్రమ 26, దేవ్మీ విహంగా 4 పరుగులు చేశారు. అనంతరం క్రీజులోకి వచ్చిన అనుష్క సంజీవని 28 పరుగులు చేసి ఔట్ అయింది. పియుమి బడాల్గే 9, సుగంధికా కుమారి 27 పరుగులు చేశారు. శ్రీలంక జట్టు 48.2 ఓవర్లలో 245 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 4 వికెట్లు, అమన్‌జోత్ కౌర్ 3 వికెట్లు, శ్రీచరణి ఒక వికెట్ పడగొట్టారు.

స్మృతి మంధాన ఖాతాలో మరో రికార్డు
ముక్కోణపు సిరీస్ ఫైనల్‌లో భారత మహిళా క్రికెట్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన సెంచరీ సాధించింది. స్మృతి మంధాన 92 బంతుల్లో ఈ సెంచరీని పూర్తి చేసింది. ఆ సమయంలో స్మృతి బ్యాట్ నుంచి 12 ఫోర్లు, 2 సిక్సర్లు వచ్చాయి. ఇది స్మృతి మంధానకు వన్డే కెరీ‌ర్‌లో 11వ సెంచరీ కావడం గమనార్హం. స్మృతి మంధాన 101 బంతుల్లో 116 పరుగులు చేసి ఔట్ అయింది. అనంతరం డుమీ విహంగ బౌలింగ్‌లో హర్షిత మాధవికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయింది. మహిళల వన్డే క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో క్రీడాకారిణిగా స్మృతి మంధాన నిలిచింది. స్మృతి కంటే ముందు న్యూజిలాండ్ కు చెందిన సుజీ బేట్స్, ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ ఉన్నారు. మెగ్ లానింగ్ 15 సెంచరీలు సాధించగా.. సుజీ బేట్స్ 13 సెంచరీలు సాధించారు.

Story first published: Sunday, May 11, 2025, 18:17 [IST]
Other articles published on May 11, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+