
వచ్చే అయిదేళ్లల్లో..
కాగా- టీమిండియాకు సంబంధించిన వచ్చే అయిదేళ్ల సైకిల్ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ విడుదల చేసింది. 2023-2027 మధ్య టీమిండియా ఆడబోయే మ్యాచ్లతో కూడిన సైకిల్ ఇది. అన్ని ఫార్మట్లల్లో భారత్ ఆడబోయే మ్యాచ్ల వివరాలను వెల్లడించింది. ఒక్కో ఫార్మట్లో ఎన్నేసి మ్యాచ్లను ఆడుతుందనే విషయాన్ని స్పష్టం చేసింది.

అన్ని ఫార్మట్లల్లో..
దీని ప్రకారం చూసుకుంటే- ఈ అయిదేళ్ల వ్యవధిలో భారత్ మొత్తంగా ఇంటర్నేషనల్ మ్యాచ్లను ఆడుతుంది. ఇందులో టెస్టుల సంఖ్య 38. 20 స్వదేశంలో మిగిలిన 18 మ్యాచ్లను విదేశీ గడ్డపై ఆడుతుంది. ఈ అయిదేళ్లల్లో టీమిండియా ఆడబోయే వన్డే ఇంటర్నేషనల్స్ 42గా నిర్ధారించింది. ఇందులో 21 స్వదేశంలో మిగిలినవి విదేశాల్లో షెడ్యూల్ చేసిన బీసీసీఐ.

తగ్గిన మ్యాచ్ల సంఖ్య..
ఈ రెండింటి కంటే ధనాధన్ ఫటాఫట్ ఫార్మట్ టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్లు అధికంగా ఉన్నాయి. 2023-2027 మధ్యకాలంలో టీమిండియా ఏకంగా 61 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడుతుంది. ఇందులో 31 మ్యాచ్లు స్వదేశంలో షెడ్యూల్ అయ్యాయి. కాగా- ప్రస్తుత అయిదేళ్ల సైకిల్ అంటే 2018-2023తో పోల్చుకుంటే టీమిండియా ఆడే మ్యాచ్ల సంఖ్య తగ్గింది. ఈ అయిదేళ్లల్లో టీమిండియా 163 మ్యాచ్లను ఆడాల్సి ఉండగా.. నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈ సంఖ్యను 141కి కుదించింది బీసీసీఐ.

ఐపీఎల్ వల్లే..
దీనికి కారణం ఏమిటనే విషయాన్ని తెలుసుకోవడానికి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ- ఇంటర్నేషనల్ మ్యాచ్ల సంఖ్యను తగ్గించిందనడంలో సందేహాలుు అక్కర్లేదు. ఈ అయిదేళ్లల్లో కూడా టీమిండియా.. ద్వైపాక్షిక సిరీస్లల్లో భాగంగా పాకిస్తాన్కు వెళ్లడం గానీ లేదా పాకిస్తాన్ జట్టు భారత పర్యటనకు రావడం గానీ జరగదు. ఆ ఊసే ఎత్తలేదు బీసీసీఐ. ఆసియా కప్ సహా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టోర్నమెంట్స్లల్లో మాత్రమే భారత్-పాకిస్తాన్ ఎదురుపడతాయి.


Click it and Unblock the Notifications
