
2005 తర్వాత పాక్లో పరిస్థితి మారింది
'ఇక ఛాంపియన్స్ ట్రోఫీని కలుపుకుంటే 12-2. పాక్లో 1990, 2000 కాలంలో వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, ఇంజమామ్ ఉల్ హక్, సయీద్ అన్వర్, జావెద్ మియాందాద్, సలీమ్ మాలిక్ వంటి హేమాహేమీలు ఉండేవారన్నాడు. అయితే 2005 తర్వాత పాక్లో పరిస్థితి మారింది. ప్రస్తుతం అక్కడ నాణ్యమైన క్రికెటర్లు లేరు' అని గంగూలీ అన్నాడు.

పాక్ క్రికెటర్ల టెక్నిక్ సైతం అంత బాగాలేదు
ప్రస్తుతం ఆ దేశ క్రికెటర్ల టెక్నిక్ సైతం అంత బాగాలేదని చెప్పాడు. ప్రస్తుతం క్రికెటర్లకు ఒత్తిడిని ఎలా జయించాలో కూడా తెలియదని గంగూలీ చెప్పుకొచ్చాడు. అయితే ఒత్తిడిలో ఉన్నప్పుడు టీమిండియా ఆటగాళ్లు రాణిస్తున్న తీరు అమోఘమని గంగూలీ ప్రశంసించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ను భారత్ ఓడిస్తుంది
అందుకే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ను ఓడించి తీరుతుందని గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లీ నేతృత్వంలో టీమిండియా అద్భుత విజయాలను సైతం కైవసం చేసుకోవడం జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని గంగూలీ పేర్కొన్నాడు.

జూన్ 4వ తేదీన పాకిస్థాన్తో భారత్ తొలి మ్యాచ్
ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా జూన్ 4వ తేదీన పాకిస్థాన్తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక గ్రూప్ స్టేజిలో కోహ్లీ సేన దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్టుతో తలపడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి పోటీ పడుతున్నాయి.


Click it and Unblock the Notifications