హాఫ్ సెంచరీ సాధించిన పృథ్వీ షా
పృథ్వీ షా 55 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా భారత్ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ సాధించిన పిన్నవయస్కుడిగా పృథ్వీ షా అరుదైన చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత పుజారా కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. మొదట్లో నెమ్మదిగా ఆడి... ఆ తర్వాత వేగం పెంచిన పుజారా 67 బంతుల్లోనే తొమ్మిది బౌండరీలతో కెరీర్లో 19వ హాఫ్ సెంచరీ చేశాడు.
|
లంచ్ విరామానికి టీమిండియా 133/1
మరో ఓపెనర్ పృథ్వీ షాతో కలిసి వికెట్ పడకుండా పుజారా ఆచితూచి జాగ్రత్తగా ఆడుతున్నాడు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో లంచ్ విరామ సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 133 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పృథ్వీషా(75), పుజారా(56) పరుగులతో ఉన్నారు.
రాజ్కోట్లో విపరీతమైన ఎండవేడిమి
లంచ్ సమయానికి వీరిద్దరూ హాఫ్ సెంచరీలు నమోదు చేయడంతో 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం రాజ్కోట్లో ఎండవేడిమి విపరీతంగా ఉంది. అయితే, ఈ ఎండవేడిమిని అధిగమించడానికి పుజారా వాటర్ బాటల్ను చెంతనే పెట్టుకున్నాడు. ఒక చిన్నసైజు వాటర్ బాటిల్ను జేబులో ఉంచుకున్నాడు.
|
బీసీసీఐ ట్విట్టర్లో వీడియో
దాహాం వేసినప్పుడు తన జేబులోనుంచి వాటర్ బాటిల్ తీసి అందులోని వాటర్ తాగుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియాని బీసీసీఐ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.