
వికెట్ ఎలా ఉందో తెలుసుకోవాలని
ఈ మ్యాచ్ టాస్ కోసం ఇరు జట్ల కెప్టెన్లు టాస్ కోసం గ్రౌండ్లోకి వచ్చారు. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. అతను మాట్లాడుతూ.. ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. బహుశా పిచ్ వికెట్కు అనుకూలంగా అనిపిస్తుంది. అందువల్ల ఎంత ఛేజింగ్ చేయాలో తెలుసుకుంటే బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ సిరీస్ కోసం చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నాం. మేము టీ20 సిరీస్ వినోదాన్ని ఇష్టపడతాం. అల్జారీ జోసెఫ్ అరంగేట్రం చేస్తున్నాడు. షిమ్రాన్ హెట్మెయర్ తిరిగి జట్టులోకి వచ్చాడు.' అని పూరన్ చెప్పాడు.

మేం రెడీగా ఉన్నాం
టాస్ ఓడిన రోహిత్ మాట్లాడుతూ.. మేం బ్యాటింగ్కు సిద్ధంగా ఉన్నాం. ఈ సిరీస్ ప్రారంభించేందుకు చాలా ఉత్సాహంగా ఉంది. మొదటి మ్యాచ్ ఇక్కడ జరగడం సంతోషకరం.. ఎందుకంటే భారత అభిమానులు స్టేడియానికి పెద్ద సంఖ్యలో రావడం చాలా బాగుంది. అన్ని సౌకర్యాలు బేషుగ్గా ఉన్నాయి. మరి వికెట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇకపోతే వన్డే సిరీస్లో ఆడిన కొందరు గాయ్స్ వెళ్లిపోయారు, కొంతమంది తిరిగి వచ్చారు. ఏదేమైనా ఈ మ్యాచ్ మాకు అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నా' అని రోహిత్ చెప్పాడు.

తుది జట్లు
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షమర్ బ్రూక్స్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్ కం కెప్టెన్), కైల్ మేయర్స్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్, కీమో పాల్
భారత్ : 1.రోహిత్ శర్మ (కెప్టెన్), 2.రిషబ్ పంత్ (వికెట్ కీపర్), 3.శ్రేయాస్ అయ్యర్, 4.సూర్యకుమార్ యాదవ్, 5.హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), 6.దినేష్ కార్తీక్, 7.రవీంద్ర జడేజా, 8. రవి బిష్ణోయ్, 9.భువనేశ్వర్ కుమార్, 10.ఆర్ అశ్విన్, 11.అర్ష్దీప్ సింగ్


Click it and Unblock the Notifications












