ఫ్లోరిడా : వెస్టిండీస్ గడ్డపై టీమిండియా హార్దిక్ పాండ్యా సారథ్యంలో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇక స్టాండ్ ఇన్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా తన మార్క్ కెప్టెన్సీని చూపించాడు. అనూహ్యంగా శ్రేయస్ అయ్యార్ను ఓపెనర్గా పంపించాడు. ఇంతకుముందు దీపక్ హుడాను, సంజూ శాంసన్ను ఐర్లాండ్ పర్యటనలో ఓపెనర్గా పంపి మార్క్ చూపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇషాన్ కిషన్తో కలిసి శ్రేయస్ అయ్యార్ బరిలోకి దిగాడు. ఇక శ్రేయస్ హాఫ్ సెంచరీ (64పరుగులు 40బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లు) క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి వీర విహారం చేశాడు. ఇక అతనికి తోడు దీపక్ హుడా (38పరుగులు 25బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) కూడా అదరగొట్టాడు. వీరిద్దరు 2వ వికెట్కు 76పరుగులు జోడించారు. ఇక మిగతవాళ్లలో ఇషాన్ కిషన్ (11) అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. సంజూ శాంసన్ (15) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దినేష్ కార్తీక్ (12) ఫినిషింగ్ మార్క్ చూపలేకపోయాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (28పరుగులు 16బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) చెలరేగడంతో ఇండియా నిర్ణీత 20ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 188పరుగులు చేయగలిగింది. వెస్టిండీస్ బౌలర్లలో ఒడియన్ స్మిత్ 3వికెట్లతో చెలరేగగా.. హోల్డర్, డ్రేక్స్, వాల్స్ తలా ఓ వికెట్ తీశారు. ఇక 189పరుగుల భారీ లక్ష్యాన్ని విండీస్ ఛేదిస్తుందో లేదో మరీ.
తుది జట్లు :
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI) : షమర్ బ్రూక్స్, షిమ్రాన్ హెట్మెయర్, నికోలస్ పూరన్ ( కెప్టెన్ ), డెవాన్ థామస్ ( వికెట్ కీపర్ ), జాసన్ హోల్డర్, ఓడియన్ స్మిత్, కీమో పాల్, డొమినిక్ డ్రేక్స్, ఒబెడ్ మెక్కాయ్, హేడెన్ వాల్ష్, రోవ్మన్ పావెల్
భారత్ (ప్లేయింగ్ XI) : ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్