రోహిత్ శర్మ ఏమన్నాడంటే..
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ ఈ విషయమై మాట్లాడుతూ.. కొత్త కుర్రాళ్లకు అవకాశాలు కల్పించాలనేది నా ఉద్దేశం. చివరి ఓవర్లో భువీ వేస్తే అతను టీం కోసం ఏమి చేసేవాడో మనకు తెలిసిందే. అతను సంవత్సరాలుగా డెత్ ఓవర్లలో ఎంతో గొప్ప బౌలింగ్ వేస్తున్నాడు. నా ప్రకారం.. అవేష్, అర్ష్దీప్ లాంటి వాళ్లకు కూడా చివరి ఓవర్ అవకాశాలు ఇస్తే తప్ప మీకు వాళ్ల సత్తా ఏంటో ఎప్పటికీ తెలియదు. అందువల్లే అవేష్ ఖాన్ను ప్రయోగించా. మేం ఓడిపోవచ్చు. కేవలం ఒక గేమ్ మాత్రమే. అవేశ్ ఖాన్ విఫలమైనంత మాత్రాన అతన్ని తక్కువ అంచనా వేయలేం. అతనిలో నైపుణ్యం, ప్రతిభ దాగి ఉంది. అతనికి మద్దతుగా నిలుస్తూనే ఉంటాం.' అని రోహిత్ అన్నాడు.
కొత్త వాళ్ల కోసం మ్యాచ్లు ఓడిపోవాలా?
ఇక రోహిత్ నిర్ణయం పట్ల నెటిజన్లు చాలా హర్ష్గా ట్వీట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ ఓ పోస్టులో.. నీకు అంతగా అవేశ్ ఖాన్ను టెస్ట్ చేయాలనిపిస్తే.. భువీకి రెస్ట్ ఇవ్వాల్సింది అంటూ ట్వీట్ చేశాడు. బుద్ధుంటే ముందే భువీని తప్పించి అవేశ్ ఖాన్ను, ఇంకా జూనియర్ పేసర్లను ఆడించాలని రోహిత్కు సదరు నెటిజన్ హితవు పలికినట్లుంది. రోహిత్ నువ్వు చేసింది తప్పనట్లేదు కానీ.. కొత్తవాళ్లను ప్రయోగించాలని చూసి మ్యాచ్ ఓడిపోయేలా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మరో నెటిజన్ దెప్పిపొడిచాడు.
వాళ్లెందుకు ఆడుతున్నారో అర్థం కావట్లేదు
మరో నెటిజన్ స్పందిస్తూ.. అసలు టీంలో అవేశ్ ఖాన్, అశ్విన్ ఎందుకు ఆడుతున్నారో అర్థం కావట్లేదు. వాళ్లిద్దరూ బౌలింగ్లో ధారాళంగా పరుగులిచ్చేస్తున్నారు. అయినా కానీ వాళ్లను పట్టుకుని వేలాడుతున్నారు. రోహిత్ గొప్ప కెప్టెన్ అంటుంటారు.. లాస్ట్ ఓవర్లో అతని మైండ్ ఎలా పనిచేసిందో మరీ అంటూ తన అక్కసు వెళ్లగక్కాడు.
ఇక ప్రముఖ క్రికెటర్ వసీం జాఫర్ సైతం.. రాత్రిళ్లు 2.30వరకు మ్యాచ్ చూసిన భారత అభిమానుల ఫ్రస్టేషన్ ఏ రేంజులో ఉందో చెప్పడానికి మిస్టర్ బీన్ వీడియోను పోస్ట్ చేశాడు. ఇకపోతే కొందరు నెటిజన్లు రోహిత్ ప్రయోగాన్ని మెచ్చుకున్నారు. కొత్త వాళ్లతో చివరి ఓవర్లో వేయిస్తేనే కదా వాళ్లకు కూడా అనుభవమొచ్చేది అంటూ రోహిత్కు వత్తాసు పలికారు.


Click it and Unblock the Notifications
