కీమర్ రోచ్ వేసిన ఆరో ఓవర్ ఆఖరి బంతికి
కీమర్ రోచ్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్ ఆఖరి బంతికి రోహిత్ శర్మ బ్యాట్కు, ప్యాడ్కు మధ్యలోంచి కీపర్ షాయ్ హోప్ చేతుల్లోకి వెళ్లింది. దీనిపై విండీస్ ఆటగాళ్లు అప్పీల్కు వెళ్లగా ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే దీనిపై విండీస్ రివ్యూ కోరగా అందులో భారత్కు వ్యతిరేకంగా ఫలితం వచ్చింది.
రోహిత్ శర్మది ఔటా.. నాటౌటా
అయితే, రోహిత్ శర్మది ఔటా.. నాటౌటా అనే దానిపై పూర్తిగా స్పష్టత లేని క్రమంలో థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు. రోహిత్ శర్మ ఆడే బంతిని డీఆర్ఎస్ ద్వారా సమీక్షించే క్రమంలో కొద్దిపాటి స్పైక్ కనబడింది. అయితే అది బంతికి తగిలిందా? లేక ప్యాడ్కు తగిలిందా? అని స్పష్టంగా తెలియకపోయినా అంఫైర్ ఔట్గా ప్రకటించాడు.
నిరాశగా పెవిలియన్కు చేరిన రోహిత్ శర్మ
దీంతో రోహిత్ శర్మ నిరాశగా పెవిలియన్కు చేరగా... విండిస్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. రోహిత్ శర్మ పెవిలియన్కు చేరే క్రమంలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని క్రికెట్ విశ్లేషకులు మండిపడుతున్నారు. రోహిత్ శర్మ ఔట్ అస్పష్టంగా ఉన్నప్పుడు ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికైనా వదిలేయాలి.
|
బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద
లేదంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాట్స్మన్కు అనుకూలంగా ఇవ్వాలి కదా అని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో జట్టు స్కోరు 29 పరుగుల వద్ద టీమిండియా రోహిత్ శర్మ(18) రూపంలో తొలి వికెట్ను కోల్పోయింది.