బెడిసికొట్టిన ప్రయోగం
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గత మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో 5 పరుగులకే రోచ్ బౌలింగ్లో ఔటై తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే రోహిత్ జతకు ఓపెనర్గా రాహుల్ను కాకుండా పంత్ను పంపిన ప్రయోగం పూర్తిగా బెడిసికొట్టింది. 34 బంతులు ఎదుర్కొన్న పంత్ 18 పరుగులు మాత్రమే చేసి ఓడియన్ స్మిత్ బౌలింగ్లో హోల్డర్కు క్యాచ్ ఔటయ్యాడు. అదే ఓవర్ చివరి బంతికి హోప్కు క్యాచ్ కోహ్లీ ( 30 బంతుల్లో 18 పరుగులు, 3 ఫోర్లు) కూడా ఔటయ్యాడు. దీంతో 43 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది.
|
ఆదుకున్న రాహుల్, సూర్య
ఈ క్రమంలో మిడిలార్డర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్కు 91 పరుగులు జోడించారు. కానీ ఈ క్రమంలో 29.4వ ఓవర్లో రోచ్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ అనవసరంగా రనౌట్ అయ్యాడు. సూర్యతో కలిసి తొలి పరుగును విజయవంతంగా పూర్తి చేసుకున్న రాహుల్.. రెండో పరుగు తీసే కన్ఫ్యూజన్తో పిచ్ మధ్యలో కాస్త ఆగి పరిగెత్తాడు. కానీ ఈ లోపే హుస్సేన్ నుంచి బంతిని అందుకుని హోప్ వికెట్లను కొట్టాడు. దీంతో ఇండియా 134 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 4 ఫోర్లు, 2 సిక్స్లతో 48 బంతుల్లోనే 49 పరుగులు చేసి తృటిలో హాఫ్ సెంచరీ చేజార్జుకున్నాడు.
|
సూర్య హాఫ్ సెంచరీ
అనంతరం వాషింగ్టన్ సుందర్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించిన సూర్యకుమార్ యాదవ్ కెరీర్లో రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 5 ఫోర్లతో 83 బంతుల్లో 64 పరుగులు చేసి ఫాబియన్ అలెన్ బౌలింగ్లో భారీ షాట్కు పయత్నించి జోసెఫ్కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్గా ఔటయ్యాడు.
ఆ కాసేపటికే 24 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్ అకేల్ హూసేన్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఈ క్రమంలో దీపక్ హుడా, శార్దూల్ ఠాకూర్ జట్టు స్కోర్ను 200 పరుగులు దాటించారు.
|
విండీస్ టార్గెట్ ఇదే
జట్టు స్కోర్ 212 పరుగుల వద్ద ఉండగా 8 పరుగులు చేసిన శార్దూల్.. జోసెఫ్ బౌలింగ్లో ఏడో వికెట్గా ఔటయ్యాడు. ఆ కాసేపటికే 47.3 ఓవర్లలో జట్టు స్కోర్ 224 పరుగుల వద్ద ఉండగా.. 5 బంతుల్లో 3 పరుగులు చేసిన సిరాజ్ జోసెఫ్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఆ వెంటనే 2 ఫోర్లతో 25 బంతుల్లో 29 పరుగులు చేసిన దీపక్ హుడా కూడా తొమ్మిదో వికెట్గా హోల్డర్ బౌలింగ్లో ఔటయ్యాడు. చివరికి నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. చాహల్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో కరేబియన్ల ముందు టీమిండియా 238 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. విండీస్ బౌలర్లలో జోసెఫ్, స్మిత్ రెండేసి, రోచ్, జేసన్ హెల్డర్, హూస్సేన్, ఫాబియన్ అలెన్ తలో వికెట్ తీశారు.