
మూడు ఫార్మాట్లు కలిపి
అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లు కలిపి ఇప్పటివరకు 19,963 పరుగులు పూర్తి చేసిన విరాట్ కోహ్లీ విండిస్తో జరుగుతున్న మ్యాచ్లో 37 పరుగులు చేయడంతో అత్యంత వేగంగా 20వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

12వ క్రికెటర్గా అరుదైన గుర్తింపు
ఫలితంగా ఈ ఘనతను సాధించిన 12వ క్రికెటర్గా అరుదైన గుర్తింపు పొందాడు. విరాట్ కోహ్లీ 417 ఇన్నింగ్స్ల్లోనే ఈ మైలురాయిని అందుకోనున్నాడు. కోహ్లీ వన్డేల్లో 11087, టెస్టుల్లో 6613, టీ20ల్లో 2263 పరుగులు చేశాడు. ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన మూడో భారత క్రికెటర్గా విరాట్ కోహ్లీ అరుదైన గుర్తింపు పొందాడు.

20వేల పరుగుల మైలురాయిని
కోహ్లీకి ముందు సచిన్ టెండూల్కర్(34,357), రాహుల్ ద్రవిడ్ల(24,208)లు మాత్రమే ఈ ఘనత సాధించారు. కాగా, 20వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్, లారాలకు 453 ఇన్నింగ్స్లు అవసరం కాగా, రికీ పాంటింగ్కు 468 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి.


Click it and Unblock the Notifications












