హైదరాబాద్: భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య జరిగే తొలి టీ20కి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. మూడు టీ20ల సిరిస్లో భాగంగా శుక్రవారం జరిగే తొలి టీ20కి నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.
ఈ నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్లపై సీపీ మహేశ్ భగవత్ గురువారం మీడియాతో మాట్లాడుతూ "డిసెంబర్ 6 బ్లాక్ డే కనుక... ఈ మ్యాచ్కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. మ్యాచ్కు వచ్చేవారితో సహా మీడియా ప్రతినిధులు పోలీసులకు సహకరించాలి" అని కోరారు.
కోహ్లీ వికెటే ముఖ్యం.. ఔట్ చేయడానికి రెండు ప్రణాళికలు ఉన్నాయి: విండీస్ కోచ్