
21 ఫ్రంట్ఫుట్ నోబాల్స్
ఇక బ్రిస్బేన్ వేదికగా జరిగిన పాకిస్థాన్, ఆస్ట్రేలియా టెస్టులోనూ తప్పులు జరిగాయి. ఈ మ్యాచ్లో ఏకంగా 21 ఫ్రంట్ఫుట్ నోబాల్స్ను అంపైర్లు గుర్తించలేకపోయారు. దీనిపై ఆటగాళ్లు, బోర్డుల నుంచి ఒత్తిడి మొదలైంది. దీంతో ఫీల్డ్ అంపైర్ల నుంచి ఆ బాధ్యతలను మూడో అంపైర్కు అప్పగించేందుకు ఐసీసీ నిర్ణయించిందని సమాచారం తెలుస్తోంది. వచ్చే నెలలో భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్ నుంచే ట్రయల్స్ మొదలవుతాయని తెలుస్తోంది.

భారత్-వెస్టిండీస్ సిరీస్ నుంచే ట్రయల్స్
'కొన్ని నెలల పాటు నోబాల్స్ అంశాన్ని మూడో అంపైర్కు అప్పగించి ఐసీసీ ట్రయల్స్ నిర్వహించనుంది. డిసెంబర్ 6న ప్రారంభమయ్యే భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్ నుంచే ట్రయల్స్ మొదలవుతాయి' అని ఐసీసీ అధికార ప్రతినిధి ఓ జాతీయ మీడియాకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

మూడో అంపైర్కు నోబాల్ బాధ్యతలు
సెకను కాలంలోనే బౌలర్ క్రీజు బయట కాలుపెట్టడం, వెంటనే బంతి దిశ, ఎల్బీ, వైడ్ వంటివి గమనించడం కష్టమవుతోందని ఫీల్డ్ అంపైర్లు పేర్కొంటున్నారు. అందుకే నోబాల్ను గుర్తించే బాధ్యతలు మూడో అంపైర్కు అప్పగిస్తే బాగుంటుందనే చర్చ చాలాకాలం అంతర్గతంగా జరుగుతోంది.

ట్రయల్స్ విజయవంతమైతే
అయితే ఇప్పటికే మూడో అంపైర్కు ఎక్కువ, సంక్లిష్టమైన బాధ్యతలు ఉన్నాయని మాజీ అంపైర్ సైమన్ టాఫెల్ వాదిస్తున్నాడు. డీఆర్ఎస్కు తోడుగా నోబాల్స్ బాధ్యత కూడా అప్పగిస్తే మూడో అంపైర్కు కష్టమని అభిప్రాయపడుతున్నాడు. ఒకవేళ ట్రయల్స్ విజయవంతమైతే.. 1992లో కేవలం రనౌట్లు తనిఖీ చేసేందుకు నియమించిన మూడో అంపైర్ నోబాల్స్ సైతం గుర్తించాల్సి ఉంటుంది


Click it and Unblock the Notifications












