For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మైదానంలోకి శునకం.. వెంటబడ్డ విండీస్ ఆటగాళ్లు.. మ్యాచ్‌కు అంతరాయం (వీడియో)!!

India vs West Indies: Stray dog invades pitch to halt play during 1st ODI

చెన్నై: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో ఆదివారం చెన్నై చెపాక్‌ స్టేడయంలో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు షిమ్రోన్‌ హెట్‌మెయిర్‌ (106 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 139 పరుగులు) సెంచరీ చేయడంతో టీమిండియా మ్యాచ్ ఓడిపోయింది. హెట్‌మెయిర్‌ భారీ షాట్లతో విరుచుకుపడడంతో భారత బౌలర్లు ఏ దశలోనూ మ్యాచ్‌ను కాపాడలేకపోయారు.

27వ ఓవర్‌లో ఘటన:

27వ ఓవర్‌లో ఘటన:

తొలి వన్డేలో ఓ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ శునకం హఠాత్తుగా మైదానంలోకి దూసుకురావడంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. భారత్ ఇన్నింగ్స్‌ 27వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ క్రీజులో ఉన్నారు. కీమో పాల్ బౌలింగ్ వేసేందుకు సిద్ధమయ్యాడు.

మైదానంలోకి శునకం:

మైదానంలోకి శునకం:

పాల్ బంతిని వేస్తుండగా.. అయ్యర్ బ్యాట్ పట్టుకుని స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో భద్రతా అధికారుల నుండి తప్పించుకొని ఓ శునకం మైదానంలోకి దూసుకొచ్చింది. ఇది గమనించిన ఆటగాళ్లు చూస్తూ ఉండిపోయారు. వెంటనే అప్రమత్తమైన గ్రౌండ్ సిబ్బంది శునకంను పట్టుకునేందుకు మైదానంలోకి వచ్చారు.

 వెంటబడ్డ విండీస్ ఆటగాళ్లు:

వెంటబడ్డ విండీస్ ఆటగాళ్లు:

ఇక బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విండీస్ ఆటగాళ్లు కూడా శునకంను తరిమేందుకు దాని వెంటపడ్డారు. దీంతో కాసేపు మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత భద్రతా సిబ్బంది దానిని బయటకు పంపడంతో మ్యాచ్ తిరిగి మొదలైంది. ఈ ఘటనతో స్టేడియంలోని ప్రేక్షకులు కాసేపు సందడి చేశారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ వీడియోను ఎంతోమంది వీక్షించారు.

విశాఖలో రెండో వన్డే:

విశాఖలో రెండో వన్డే:

ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. పంత్‌ (71), శ్రేయస్‌ (70) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. కేదార్‌ జాదవ్‌ (40) రాణించాడు. అనంతరం విండీస్‌ 2 వికెట్లు కోల్పోయి 47.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. హెట్‌మెయిర్‌ (139), హోప్‌ (102) సెంచరీలు చేశారు. విశాఖ వేదికగా రెండో వన్డే బుధవారం జరగనుంది.

Story first published: Monday, December 16, 2019, 13:26 [IST]
Other articles published on Dec 16, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+