టీమిండియా నమోదు చేసిన అత్యధిక స్కోరు
413 - ఈ వేదికలో టీమిండియా నమోదు చేసిన అత్యధిక స్కోరు ఇది. 2007 వరల్డ్కప్లో బెర్ముడాతో జరిగిన వన్డే మ్యాచ్లో టీమిండియా ఈ స్కోరు సాధించింది.
#62 - మూడో వన్డేలో గనుక టీమిండియా విజయం సాధిస్తే... భారత జట్టుపై వెస్టిండిస్ సాధించిన విజయాల సంఖ్య(62)ను సమం చేస్తుంది.
భువనేశ్వర్ కుమార్ మరో వికెట్ తీస్తే
1 - వన్డేల్లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ స్టేడియంలో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ మరో వికెట్ తీస్తే... ఈ వేదికలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా అరుదైన గుర్తింపు సాధిస్తాడు.
58 - వన్డేల్లో భారత క్రికెట్ జట్టుపై షాయ్ హోప్ 500 పరుగుల మైలురాయిని అందుకోడానికి అవసరమైన పరుగులు.
వన్డేల్లో 500 పరుగుల మైలురాయిని
91 - వన్డేల్లో 500 పరుగుల మైలురాయిని అందుకోడానికి వెస్టిండిస్ ఆటగాడు నికోలస్ పూరన్కు అవసరమైన పరుగులు.
27 - రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీలు మరో 27 పరుగులు చేస్తే వన్డేల్లో 1000 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా నిలుస్తుంది. ఫలితంగా వన్డేల్లో వెస్టిండిస్పై ఈ ఘనత సాధించిన మొట్టమొదటి జోడీగా చరిత్ర సృష్టిస్తారు.
యజువేంద్ర చాహుల్కు 50వ వన్డే
#50 - మూడో వన్డే తుది జట్టలో యజువేంద్ర చాహుల్కు గనుక చోటు లభిస్తే అతడికి ఇది 50వ వన్డే అవుతుంది.
10 - టీమిండియాపై క్రిస్గేల్ హాఫ్ సెంచరీ బాది 10 ఏళ్లు అవుతుంది. 2009 జూన్ 28న కింగ్స్టన్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో క్రిస్ గేల్ 46 బంతుల్లో 64 పరుగులు చేశాడు.