For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌పై క్రిస్ గేల్ హాఫ్ సెంచరీ బాది 10 ఏళ్లు అవుతుంది

India vs West Indies: Statistical preview of 3rd ODI at Port of Spain - Kohli, Rohit and Kuldeep eye big records

హైదరాబాద్: టీ20 సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు వన్డే సిరిస్‌పై కన్నేసింది. వెస్టిండిస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరిస్‌లో ఇప్పటికే టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో ఆఖరిదైన మూడో వన్డే బుధవారం జరగనుంది.

దీంతో మూడో వన్డేలో కూడా విజయం సాధించి 2-0తో సిరీస్‌ సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. అయితే, గాయం తర్వాత విండిస్ పర్యటనలో పునరాగమనం చేసిన టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఇంకా గాడిన పడకపోవడం అభిమానులను ఆందోళన కలిగిస్తోంది.

మూడు టీ20ల సిరిస్‌లో ధావన్ 1, 23, 3 పరుగులతో నిరాశ పరిచాడు. తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఇక, రెండో వన్డేలో 2 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. వన్డే సిరిస్ అనంతరం టీమిండియా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో టెస్టుల్లో చోటు దక్కించుకునేందుకు ధావన్‌కు మూడో వన్డే చివరి అవకాశం కానుంది. ఈ నేపథ్యంలో మూడో వన్డేలో ధావన్ ఒత్తిడితో బరిలోకి దిగుతుండగా... మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు అరుదైన రికార్డులకు చేరువయ్యారు. అవేంటో ఒక్కసారి చూద్దాం...

టీమిండియా నమోదు చేసిన అత్యధిక స్కోరు

టీమిండియా నమోదు చేసిన అత్యధిక స్కోరు

413 - ఈ వేదికలో టీమిండియా నమోదు చేసిన అత్యధిక స్కోరు ఇది. 2007 వరల్డ్‌కప్‌లో బెర్ముడాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఈ స్కోరు సాధించింది.

#62 - మూడో వన్డేలో గనుక టీమిండియా విజయం సాధిస్తే... భారత జట్టుపై వెస్టిండిస్ సాధించిన విజయాల సంఖ్య(62)ను సమం చేస్తుంది.

భువనేశ్వర్ కుమార్ మరో వికెట్ తీస్తే

భువనేశ్వర్ కుమార్ మరో వికెట్ తీస్తే

1 - వన్డేల్లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ స్టేడియంలో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ మరో వికెట్ తీస్తే... ఈ వేదికలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అరుదైన గుర్తింపు సాధిస్తాడు.

58 - వన్డేల్లో భారత క్రికెట్ జట్టుపై షాయ్ హోప్ 500 పరుగుల మైలురాయిని అందుకోడానికి అవసరమైన పరుగులు.

వన్డేల్లో 500 పరుగుల మైలురాయిని

వన్డేల్లో 500 పరుగుల మైలురాయిని

91 - వన్డేల్లో 500 పరుగుల మైలురాయిని అందుకోడానికి వెస్టిండిస్ ఆటగాడు నికోలస్ పూరన్‌కు అవసరమైన పరుగులు.

27 - రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీలు మరో 27 పరుగులు చేస్తే వన్డేల్లో 1000 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా నిలుస్తుంది. ఫలితంగా వన్డేల్లో వెస్టిండిస్‌పై ఈ ఘనత సాధించిన మొట్టమొదటి జోడీగా చరిత్ర సృష్టిస్తారు.

యజువేంద్ర చాహుల్‌కు 50వ వన్డే

యజువేంద్ర చాహుల్‌కు 50వ వన్డే

#50 - మూడో వన్డే తుది జట్టలో యజువేంద్ర చాహుల్‌కు గనుక చోటు లభిస్తే అతడికి ఇది 50వ వన్డే అవుతుంది.

10 - టీమిండియాపై క్రిస్‌గేల్ హాఫ్ సెంచరీ బాది 10 ఏళ్లు అవుతుంది. 2009 జూన్ 28న కింగ్‌స్టన్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ 46 బంతుల్లో 64 పరుగులు చేశాడు.

Story first published: Wednesday, August 14, 2019, 15:08 [IST]
Other articles published on Aug 14, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+