ఫీల్డింగ్ నాసిరకంగా
"గత రెండు మ్యాచుల్లో మా ఫీల్డింగ్ నాసిరకంగా ఉంది. భువనేశ్వర్ వేసిన ఓవర్లో రెండు క్యాచ్లు జారవిడిచాం. మా ఫీల్డింగ్ కచ్చితంగా మెరుగుపడాలి. తొలి టీ20లో ఒక క్యాచ్ను అందుకోవడానికి ఒంటి చేత్తో ప్రయత్నించాను. కానీ, అది సాధ్యపడలేదు. ఈ సారి రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నా" అని కోహ్లీ తెలిపాడు.

చివరి నాలుగు ఓవర్లలో
"చివరి నాలుగు ఓవర్లలో మా బ్యాటింగ్ బాగాలేదు. 16 ఓవర్లు పూర్తయ్యేసరికి 144/4తో ఉన్నాం. ఈ దశలో మరో 50 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేది. కానీ అలా జరగలేదు. ఈ అంశంపై దృష్టి సారిస్తాం. శివమ్ దూబే చక్కగా ఆడాడు. ఇక చివరిదైన మూడో మ్యాచ్ చావోరేవో లాంటిది కాబట్టి వంద శాతం పోరాడుతాం" అని కోహ్లీ వెల్లడించాడు.

శివ్ దూబే హాఫ్ సెంచరీ
రెండో టీ20లో వన్డౌన్లో కోహ్లీకి బదులు వచ్చిన శివమ్ దూబే (54; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. టీ20ల్లో శివమ్ దూబేకి ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్లో తొలుత నిదానంగా ఆడిన దూబే తర్వాత సిక్సర్లు, బౌండరీలతో విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

8 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి
ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలి టీ20లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియాకు రెండో మ్యాచ్లో ఓటమి తప్పలేదు. ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా టీమిండియాకు ఓటమి తప్పలేదు. 171 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంకో 9 బంతులుండగానే ఛేదించింది. లెండిల్ సిమన్స్ (67 నాటౌట్) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.


Click it and Unblock the Notifications












