
కోహ్లీ vs రోహిత్ శర్మ
అయితే, ఇప్పుడు విరాట్ కోహ్లీకి తన సహచర ఆటగాడు రోహిత్ శర్మ నుంచే తీవ్ర పోటీ ఎదురుకానుంది. ఈ ఏడాది మూడు ఫార్మాట్లు కలిసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ(2,090) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో పాక్ ఆటగాడు బాబర్ అజామ్(1820) మూడో స్థానంలో ఉన్నాడు.

రోహిత్ శర్మ అధిగమించే అవకాశం
దీంతో కోహ్లీకి రోహిత్ శర్మల మధ్య పరుగుల వ్యత్యాసం భారీగా లేకపోవడంతో కోహ్లీని ఈ ఏడాది రోహిత్ శర్మ అధిగమించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఈ ఏడాది టీమిండియా ఇంకా ఆడాల్సిన మ్యాచ్లు ఆరు ఉన్నాయి. ఈ ఆరు మ్యాచ్లు కూడా సొంతగడ్డపైనే కావడం విశేషం.

వరుసగా 4వ ఏడాది
ఒకటి మూడు టీ20 సిరీస్ అయితే, ఇంకొటి మూడు వన్డేల సిరీస్. ఈ సిరిస్లో విరాట్ కోహ్లీ బ్యాట్తో రాణిస్తే వరుసగా 4వ ఏడాది అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు. టీ20ల్లో ఓపెనర్గా రోహిత్ శర్మ సక్సెస్ అయితే కోహ్లీకి పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉండదు. ఒకవేళ రోహిత్ విఫలమైతే, కోహ్లీ రాణించే అవకాశముంది.

2019లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా!
దీంతో విండీస్తో జరిగే మూడు వన్డేల సిరీస్లో కోహ్లీ విఫలమై... రోహిత్ శర్మ రాణిస్తే 2019లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం వీరిద్దరూ మంచి ఫామ్లో ఉన్నారు. 2016లో 2,595 పరుగులతో అగ్రస్థానంలో నిలిచిన కోహ్లీ ఆ తర్వాత 2017లో 2,818 పరుగులు... 2018లో 2,735 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు.


Click it and Unblock the Notifications












