|
సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా
ఒక మ్యాచ్ టైగా ముగిసిన సంగతి తెలిసిందే. తాజా విజయంతో రికార్డు స్థాయిలో విండీస్ జట్టుపై వరుసగా ఎనిమిదో వన్డే సిరీస్ విజయాన్ని, సొంతగడ్డపై వరుసగా ఆరో వన్డే సిరీస్ను కోహ్లీసేన నెగ్గడం విశేషం. భారత్ చివరిసారి 2015లో సొంతగడ్డపై వన్డే సిరిస్ను చేజార్చుకుంది. ఆఖరి వన్డేలో భారీ విజయంతో సిరీస్ను కైవసం చేసుకోవడంతో పలువురు టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా రవీంద్ర జడేజా
ఈ మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసిన టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని కెప్టెన్ కోహ్లీ గెలుచుకున్నాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ 6 పరుగులకే పెవిలియన్కు చేరగా, రోహిత్ శర్మ మరోసారి హాఫ్ సెంచరీతో మెరిశాడు. మొత్తం 56 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు.
ఆఖరి వన్డేలో 200వ సిక్సర్ బాదిన రోహిత్ శర్మ
కెప్టెన్ కోహ్లీ 33 పరుగులు చేశాడు. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ 104 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ వన్డేల్లో 200వ సిక్సర్ బాదాడు. కేవలం 187 ఇన్నింగ్సుల్లోనే రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. అంతేకాదు వెస్టిండీస్పై ఒక సిరీస్లో అత్యధిక పరుగులు 360 చేసిన రెండో భారత ఆటగాడిగా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో కోహ్లీ 444 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.