ఒక్క ఛాన్స్:
శాంసన్ టీమిండియాతో ప్రయాణిస్తున్నప్పటికీ తుది జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ వరుసగా విఫలమవుతున్నప్పటికీ.. టీమ్మేనేజ్మెంట్, కెప్టెన్ విరాట్ కోహ్లీ మరలా అతడికే అవకాశాలు ఇస్తున్నారు. దీంతో శాంసన్తో పాటు కేరళ అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. ఒక్క మ్యాచ్లో అవకాశం ఇస్తే అతడి ప్రతిభ ఏంటో తెలుస్తుంది కదా అని మండిపడుతున్నారు.
నిరాశలో అభిమానులు:
ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టీ20లో పంత్ విఫలమవ్వడంతో.. తిరువనంతపురం వేదికగా జరిగే రెండో మ్యాచ్లో స్థానిక ఆటగాడు అయిన శాంసన్కు అవకాశం ఇస్తారని అందరూ భావించారు. అయితే కెప్టెన్ మాత్రం పంత్కే ఓటేశాడు. దీంతో కేరళ అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవకాశం ఇస్తారనుకున్నాం:
'శాంసన్ను సొంత మైదానం (తిరువనంతపురం)లో ఆడించే అవకాశం ఇస్తారని అనుకున్నాం. శాంసన్ ఆడేందుకు టీమిండియా ఒక ఆటగాడికి విశ్రాంతి ఇస్తుందని ఆశించాం. తిరువనంతపురంలో అద్భుతాలు చేయాలని కోరుకున్నాం. కానీ.. నిరాశే ఎదురైంది. శాంసన్కు ఉన్న అత్యంత ధైర్య సాహసాలు, ఓపికకు మేమందరం ఏంతో ప్రేరణ పొందుతున్నాం' అంటూ శశిథరూర్ ట్వీట్ చేశారు.
అతని హృదయాన్ని పరీక్షించాలనుకుంటున్నారా?
బంగ్లాదేశ్ సిరీస్లో సంజుకు అవకాశం ఇవ్వలేదు. అప్పుడు కూడా శశిథరూర్ స్పందించాడు. 'అవకాశం ఇవ్వకుండా శాంసన్ను ఎంపిక చేయకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది. అతనికి కనీసం అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఆటగాళ్లకు డ్రింక్స్ ఇవ్వదానికే పరిమితం చేశారు. సంజు బ్యాటింగ్ను పరీక్షించాలనుకుంటున్నారా లేక అతని హృదయాన్నా?' అంటూ ట్వీట్లో రాసుకొచ్చాడు. చాలా సందర్భాల్లోనే శాంసన్కు శశిథరూర్ మద్దతుగా నిలిచారు.