For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

5వ వన్డేలో భారత్ విజయం: 3-1తో ఐదు వన్డేల సిరిస్ కైవసం

India Vs West Indies 2018, 5th ODI : India Win By 9 Wickets To Bag Series 3-1 | Oneindia Telugu
India vs West Indies Live Score 5th ODI: India win by 9 wickets to bag series 3-1

హైదరాబాద్: తిరువనంతపురం వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన ఐదో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరిస్‌ను టీమిండియా 3-1తో సొంతం చేసుకుంది. 105 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 14.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

ఓపెనర్ శిఖర్ ధావన్ 6 పరుగులకే పెవిలియన్‌కు చేరగా, రోహిత్ శర్మ మరోసారి హాఫ్ సెంచరీతో మెరిశాడు. మొత్తం 56 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. కెప్టెన్ కోహ్లీ 33 పరుగులు చేశాడు. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ 104 పరుగులకే ఆలౌటైంది. జడేజా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

 టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండిస్

టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండిస్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండిస్ జట్టుకు సరైన శుభారంభం లభించలేదు. తొలి పరుగు వద్ద కీరన్‌ పావెల్‌ (0)ను భువనేశ్వర్ పెవిలియన్‌కు చేర్చగా, రెండో పరుగు వద్ద షైహోప్‌ (0)ను బుమ్రా పెవిలియన్‌కు చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శామ్యూల్స్‌ (24), రోమన్‌ పావెల్‌ (16) స్కోరు బోర్డుని నడిపించారు.

36 పరుగుల వద్ద శామ్యూల్స్‌ ఔట్

36 పరుగుల వద్ద శామ్యూల్స్‌ ఔట్

జట్టు స్కోరు 36 పరుగుల వద్ద శామ్యూల్స్‌ను జడేజా పెవిలియన్‌కు చేర్చగా, ఆ తర్వాత కొద్దిసేపటికే ఖలీల్‌ బౌలింగ్‌లో రోమన్‌ ఔటయ్యాడు. ఈ సిరిస్‌లో తొలి నాలుగు వన్డేల్లో రాణించిన హిట్‌మెయిర్ (9) పరుగుల వద్ద జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ (25) కాసేపు క్రీజులో నిలిచాడు.

ముగ్గురు బ్యాట్స్‌మన్ మాత్రమే రెండంకెల స్కోరు

ఆ తర్వాత యువ పేసర్ ఖలీల్ అతడిని కూడా పెవిలియన్‌కు చేర్చాడు. వెస్టిండిస్ జట్టులో కేవలం ముగ్గురు బ్యాట్స్‌మన్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగా... కెప్టెన్ జాసన్ హోల్డర్ 25 పరుగులతో టాస్ స్కోరర్‌గా నిలిచాడు. ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్స్‌కే పరిమితమైపోయారు. దీంతో చివరికి ఆ జట్టు 31.5 ఓవర్లకు 104 పరుగులకు ఆలౌటైంది.

నాలుగు వికెట్లు తీసిన రవీంద్ర జడేజా

నాలుగు వికెట్లు తీసిన రవీంద్ర జడేజా

భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టగా, బుమ్రా, అహ్మద్‌కు రెండు, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీసుకున్నారు. తాజా విజయంతో రికార్డు స్థాయిలో విండీస్‌ జట్టుపై వరుసగా ఎనిమిదో వన్డే సిరీస్ విజయాన్ని, సొంతగడ్డపై వరుసగా ఆరో వన్డే సిరీస్‌ను కోహ్లీసేన నెగ్గడం విశేషం.

Story first published: Thursday, November 1, 2018, 18:41 [IST]
Other articles published on Nov 1, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+