హైదరాబాద్: నెల రోజుల కరీబియన్ పర్యటన తుది అంకానికి చేరుకుంది. జమైకాలోని కింగ్స్టన్ వేదికగా వెస్టిండిస్తో శుక్రవారం రెండో టెస్ట్ అరంభమైంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన వెస్టిండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది.
అతడే సమయమిచ్చాడు: ధోనీని ఎంపిక చేయకపోవడం వెనుక కొత్త ట్విస్ట్!
పిచ్పై ఉన్న తేమను ఉపయోగించుకుని టీమిండియా మిడిలార్డర్ను త్వరగా ఔట్ చేస్తామని వెస్టిండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ చెప్పుకొచ్చాడు. మరోవైపు ఈ టెస్టును గెలిచి క్లీన్ స్వీప్ చేస్తామని భారత జట్టు కెప్టెన్ కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇన్నింగ్స్లో పెద్ద స్కోర్లు చేసేందుకు 70-80 పరుగుల భాగస్వామ్యం అవసరమని కోహ్లీ చెప్పాడు.
ఈ పర్యటనలో ఇప్పటికే టీ20లు, వన్డే సిరీస్లను గెలుచుకున్న టీమిండియా.. ఇప్పుడు టెస్టు సిరిస్పై కన్నేసింది. తొలి టెస్టులో 318 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రెండు మ్యాచ్ల సిరిస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.
West Indies have won the toss and elect to bowl first in the 2nd Test against #TeamIndia#WIvIND pic.twitter.com/pI8f9GAIe5
— BCCI (@BCCI) August 30, 2019
ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో ఆత్మవిశ్వాసంతో కోహ్లీసేన బరిలోకి దిగుతుండగా... చివరి మ్యాచ్లోనైనా విజయం సాధించి తమ పరువు కాపాడుకోవాలని ఆతిథ్య విండీస్ జట్టు భావిస్తోంది. సొంతగడ్డపై వెస్టిండిస్ గత రెండేళ్లుగా ఒక్క టెస్టు సిరిస్ను కూడా కోల్పోలేదు.
Blue+Green+game in whites = 👌🏻😎 #TeamIndia #WIvIND pic.twitter.com/0nuIWEYP1u
— BCCI (@BCCI) August 30, 2019
గత రెండేళ్లలో మొత్తం మూడు సిరిస్లు జరగ్గా రెండింట విజయం సాధించిన వెస్టిండిస్ ఒక సిరిస్ను డ్రాగా ముగించింది. దీంతో జాసన్ హోల్డర్ సేన ఈ సిరిస్ను కూడా డ్రా చేసుకుంటుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తొలి టెస్టులో బౌలింగ్లో మంచి ప్రదర్శన చేసినప్పటికీ.. బ్యాటింగ్లో తేలిపోయారు.
ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే అనేక రికార్డులు బద్దలవుతాయి. టీమిండియా గెలిస్తే టెస్టుల్లో టీమిండియాకు అత్యధిక విజయాలనందించిన కెప్టెన్గా విరాట్ కోహ్లీ నిలుస్తాడు. కెప్టెన్గా ఇప్పటివరకు 47 టెస్టుల్లో 27 విజయాలు సాధించిన కోహ్లీ.. ప్రస్తుతం ధోనితో సమంగా ఉన్నాడు. గంగూలీ (49 టెస్టుల్లో 21) మూడో స్థానంలో ఉన్నాడు.
How's that for a Day 1 pitch? 🧐🤔 #TeamIndia #WIvsIND pic.twitter.com/7qGCZYlmO4
— BCCI (@BCCI) August 30, 2019
జట్ల వివరాలు:
వెస్టిండీస్: క్రైగ్ బ్రాత్వైట్, జాన్ కాంప్బెల్, షమర్ బ్రూక్స్, డారెన్ బ్రావో, షిమ్రాన్ హెట్మీర్, జహ్మార్ హామిల్టన్, రాహకీమ్ కార్న్వాల్ (వికెట్ కీపర్), రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్ (సి), కేమర్ రోచ్, షానన్ గాబ్రియేల్
ఇండియా: లోకేష్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చేతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె, హనుమా విహారీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఇశాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా