|
86 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన వెస్టిండిస్
ఓపెనర్లు బ్రాత్వెయిట్ 14, పావెల్ 22, షాయ్ హోప్ 36 పరుగులు చేసి ఔటయ్యారు. దీంతో విండీస్ 86 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హోప్, హెట్మెయిర్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు. కానీ ఉమేశ్ యాదవ్ హోప్(36) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు.
తొలి వికెట్కు 32 పరుగులు జోడించిన ఓపెనర్లు
తొలి వికెట్కు ఓపెనర్లు 32 పరుగులు జోడించి కాస్త కుదురుకుంటున్నట్లు కనిపించినా ఆ తర్వాత మూడు వికెట్లు కోల్పోయింది. 32వ ఓవర్ మూడో బంతికి హోప్ ఎల్బీగా వెనుదిరగడంతో అంపైర్లు భోజన విరామాన్ని ప్రకటించారు. ఈ మ్యాచ్లో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
|
గాయంతో మైదానాన్ని వీడిన శార్దూల్ ఠాకూర్
షమి స్థానంలో శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన శార్థుల్ ఠాకుర్ను దురదృష్టం వెంటాడింది. 1.4 ఓవర్లు వేసిన తర్వాత మడమ గాయం కారణంగా గాయంతో మైదానాన్ని వీడాడు. రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఇప్పటికే టీమిండియా 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.
|
వెస్టిండిస్ జట్టులో రెండు మార్పులు
వెస్టిండీస్ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. తొలి టెస్ట్కి దూరమైన కెప్టెన్ హోల్డర్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. కీమర్ రోచ్, షెమాన్ లూయిస్ స్థానాల్లో జట్టులోకి కీమోపాల్, జోమెల్ వారికాన్లకు చోటు కల్పించారు. తొలి టెస్టులో దారుణంగా ఓడిన వెస్టిండిస్ జట్టు ఈ టెస్టులో ఎలాగైన నెగ్గి పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. మరోవైపు భారత్ మాత్రం తమ జైత్రయాత్రను కొనసాగించాలనే పట్టుదలతో ఉంది.