12 మంది ఆటగాళ్లతో తుది జట్టు
రెండో టెస్టుకు బీసీసీఐ ప్రకటించిన 12 మంది ఆటగాళ్ల జాబితాలో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లు సిరాజ్, విహారిల పేర్లు లేకపోవడం విశేషం. ఇక ఈ ఇద్దరు ఆటగాళ్లు తొలి టెస్ట్లో సైతం బెంచ్కే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ వేదికగా జరిగే రెండో టెస్టులో వీరు పేర్లు ఉంటాయని అందరూ భావించారు.
మయాంక్ అగర్వాల్కు కూడా నిరాశే
కానీ బీసీసీఐ ఇందుకు భిన్నంగా జట్టుని ప్రకటించింది. మరోవైపు మయాంక్ అగర్వాల్కు కూడా నిరాశే ఎదురైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానంలో యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్కు అవకాశం కల్పిస్తారని భావించినా జట్టు మేనేజ్మెంట్ మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దేశవాళీ, భారత్-ఏ తరపున అద్భుత ప్రదర్శన కనబర్చిన మయాంక్ తొలి టెస్టు ఆడేందుకు మరికొంత కాలం వేచి ఉండక తప్పేలా లేదు.
కేఎల్ రాహుల్కు మరో అవకాశం
తొలి టెస్టులో కేఎల్ రాహుల్ విఫలమైనా అతనికి మరోసారి అవకాశం ఇచ్చింది. ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలోనే రాహుల్కు మరో అవకాశం ఇచ్చి ఉంటారని క్రీడావిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నవంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడానికి ముందు టీమిండియా ఆడనున్న చివరి టెస్టు ఇదే కావడంతో పూర్తి స్థాయి జట్టుని బరిలోకి దించాలని నిర్ణయించారు.
ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లుతో జట్టు
ఈ నేపథ్యంలో 12 మందితో కూడిన తుది జట్టుని గురువారం జట్టు మేనేజ్మెంట్ ప్రకటించింది. ఇందులో ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు ఉండగా... ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ మరోసారి హైదరాబాద్ టెస్టు తుది జట్టులో స్థానం కోసం పోటీ పడనున్నారు. తుది జట్టులో ముగ్గుర్లు స్పిన్నర్లు అవసరమైతే.. శార్థుల్ ఠాకుర్ బెంచ్కు పరిమితం కానున్నాడు.
|
ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగితే కుల్దీప్పై వేటు
ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగితే మాత్రం కుల్దీప్ యాదవ్పై వేటు పడే అవకాశం ఉంది. రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా రాజ్ కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఏకంగా ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో ఓడించి.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది.
హైదరాబాద్ టెస్టుకు టీమిండియా:
విరాట్ కోహ్లీ, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, పుజారా, రహానే, రిషబ్ పంత్, జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్, షమి, ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్.