హైదరాబాద్: ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీ(16) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు దూకుడుగా ఆడి 80 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 100 పరుగులు మైలురాయిని అందుకున్నాడు.
ముంబైలో 4వ వన్డే: అరుదైన రికార్డు నెలకొల్పిన రోహిత్-ధావన్
వన్డేల్లో రాయుడికి ఇది మూడో సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 377 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ(162: 137 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సులు) భారీ సెంచరీని నమోదు చేశాడు. వన్డేల్లో రోహిత్ శర్మ 150కిపైగా పరుగులు చేయడం ఇది ఏడోసారి కావడం విశేషం.
ఓపెనర్ శిఖర్ ధావన్ (38), కెప్టెన్ విరాట్ కోహ్లీ (16) తక్కువ స్కోరుకే ఔటవడంతో.. జట్టు స్కోరు 101 వద్ద క్రీజులోకి వచ్చిన రాయుడితో కలిసి రోహిత్ శర్మతో మూడో వికెట్కి అభేద్యంగా 211 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ ఏడాది ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేయడం ద్వారా రాయుడు మళ్లీ భారత జట్టులోకి పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే.
.@RayuduAmbati departs after scoring his 3rd 💯 off 80 deliveries #INDvWI.
— BCCI (@BCCI) October 29, 2018
What an innings from Rayudu this has been! pic.twitter.com/0flMaT1Cbc