హైదరాబాద్: వెస్టిండిస్ పర్యటనలో టీమిండియా పేసర్ భువనేశ్వర్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా గత ఆదివారం వెస్టిండిస్తో జరిగిన రెండో మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ 31 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. దీంతో పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో గేల్తో సమానంగా నిలిచాడు.
వివాదంలో టీమిండియా మేనేజర్: స్వదేశానికి రావాలంటూ పిలుపు!
వెస్టిండిస్ దిగ్గజం అంబ్రోస్ 24 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. విండీస్ బౌలర్లు మెర్విన్ డిల్లాన్, క్రిస్ గేల్, భువనేశ్వర్ తలో 15 వికెట్లు ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా బుధవారం ప్రారంభమైన మూడో వన్డేలో భువనేశ్వర్ మరో వికెట్ తీస్తే ఈ జాబితాలో రెండో స్థానంలో నిలుస్తాడు.
విండీస్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్ వర్షర్పారణం కాగా రెండో వన్డేలో కోహ్లీసేన 59 పరుగుల తేడాతో గెలిచింది. ఇటీవల జరిగిన టీ20 సిరీస్ను టీమిండియా 3-0తో క్లీన్స్వీప్ చేసిన విషయం తెలిసిందే. కాగా, మూడో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండిస్ జట్టు కెప్టెన్ కార్లోస్ బ్రాత్వైట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
మూడో వన్డేకి వరుణుడు అంతరాయం కలిగించాడు. చిరుజల్లులు మొదలవ్వడంతో సిబ్బంది పిచ్పై కవర్లు కప్పారు. అంపైర్లు మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. వర్షం వచ్చి మ్యాచ్ నిలిచిపోయే సమయానికి వెస్టిండిస్ జట్టు 22 ఓవర్లకు గాను 158/2 స్థితిలో ఉంది. హోప్ (19), హెట్మైయిర్ (18) పరుగులతో ఉన్నారు.
PHOTO: నగ్న చిత్రాన్ని ఇనిస్టాగ్రామ్లో పోస్టు చేసిన మహిళా క్రికెటర్
అంతకముందు ఈ మ్యాచ్లో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది. కుల్దీప్ యాదవ్ స్థానంలో చైనామన్ స్పిన్నర్ యుజవేంద్ర చాహల్ను తుది జట్టులోకి తీసుకుంది. మరోవైపు విండీస్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. షెల్డన్ కొట్రెల్ స్థానంలో కీమో పాల్, ఓషెన్ థామస్ స్థానంలో ఫాబైన్ అలెన్ జట్టులోకి వచ్చారు.
ఇదిలా ఉంటే, ఈ సిరిస్లో గుయానా వేదికగా జరగ్సాల్సిన మొదటి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, ఇదే వేదికలో జరిగిన రెండో వన్డేలో భారత్ విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరిస్లో 1-0తో టీమిండియా ఆదిక్యంలో ఉంది. దీంతో మూడో వన్డే ఇరు జట్లకు కీలకంగా మారింది.