హైదరాబాద్: వెస్టిండిస్ తో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా రెండో వన్డేలోనూ సెంచరీ సాధించాడు. బుధవారం విశాఖపట్నం వేదికగా ప్రారంభమైన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ 107 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 102 పరుగుతో సెంచరీని సాధించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 37వ సెంచరీ కావడం విశేషం.విరాట్ కోహ్లీ commat; 10000: ఐదో భారత బ్యాట్స్ మన్ గా రికార్డుఈ ఏడాది కోహ్లీ 11 మ్యాచ్ లలో 989 పరుగులు చేసి 1000 పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నాడు. ఈ స్టేడియంలో విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో నాలుగు వన్డేలాడిన కోహ్లి వరుసగా 118, 117, 99, 65 పరుగులతో సత్తాచాటాడు. తాజాగా ఐదో వన్డే ఆడుతోన్న కోహ్లీ సెంచరీ నమోదు చేయడంతో విశాఖ స్టేడియం కోహ్లీకి లక్కీ గ్రౌండ్ గా మారిపోయింది.అంతకు ముందు కోహ్లీ 81 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 10వేల మైలురాయి అందుకున్నాడు. తాజా సెంచరీతో విండీస్ పై అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ గా కోహ్లీ(6) రికార్డు సృష్టించాడు. గిబ్స్ , ఆమ్లా, డివిలియర్స్ ల పేరిట ఉన్న 5 సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమించాడు.ఇదిలా ఉంటే విశాఖ స్టేడియంలో ఐదు ఇన్నింగ్స్ ల్లో మూడో సెంచరీలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్ లోని మిర్ పూర్ లో కోహ్లీ 13 ఇన్నింగ్స్ లో నాలుగు సెంచరీలు బాదిన కోహ్లీ ఆ తర్వాత విశాఖలోనే ఎక్కువ సెంచరీలు సాధించాడు. తొలి వన్డేలో సెంచరీ సాధించిన కోహ్లీ 81 పరుగులు చేయడంతో వన్డేల్లో పదివేల పరుగులు ఈ సిరిస్ లో భాగంగా గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కోహ్లీ 81 పరుగులు చేయడంతో వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా పది వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్ గా అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో పది వేల పరుగులు చేసిన ఐదో భారత బ్యాట్స్మన్గా కోహ్లీ రికార్డు వన్డేల్లో పది వేల పరుగులు చేసిన ఐదో భారత బ్యాట్స్ మన్ గా మొత్తంగా 13వ బ్యాట్స్ మన్ గా నిలిచాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), మహేంద్రసింగ్ ధోనీ (10,126) మాత్రమే ఈ రికార్డుని అందుకున్నారు. ఈ క్రమంలో సచిన్ రికార్డుని కోహ్లీ అధిగమించాడు. కోహ్లీకి 205 ఇన్నింగ్స్లు సచిన్ రికార్డు బద్దలు వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్ 259 ఇన్నింగ్స్ లు తీసుకోగా కోహ్లీకి 205 ఇన్నింగ్స్ లు అవసరమయ్యాయి. మరోవైపు సౌరవ్ గంగూలీ 263, రికీ పాంటింగ్ 266 ఇన్నింగ్స్ లు తీసుకున్నారు. ఇప్పటివరకు సచిన్ (259 ఇన్నింగ్స్ ) పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో పదివేల పరుగులు చేసిన క్రికెటర్లు పదివేల పరుగులు చేసిన క్రికెటర్లు వీరే * విరాట్ కోహ్లీ (213 వన్డేలు- భారత్ )* సచిన్ తెందుల్కర్ (266- భారత్ )* సౌరవ్ గంగూలీ (272- భారత్ )* రికీ పాంటింగ్ (272- ఆస్ట్రేలియా)* జాక్వెస్ కలిస్ (286- దక్షిణాఫ్రికా)* ఎంఎస్ ధోనీ (320- భారత్ )* బ్రియన్ లారా (287- వెస్టిండీస్ )* రాహుల్ ద్రవిడ్ (309- భారత్ )