81 పరుగులు చేయడంతో వన్డేల్లో పదివేల పరుగులు
ఈ సిరిస్లో భాగంగా గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో కోహ్లీ 81 పరుగులు చేయడంతో వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా పది వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్గా అరుదైన ఘనత సాధించాడు.
ఐదో భారత బ్యాట్స్మన్గా కోహ్లీ రికార్డు
వన్డేల్లో పది వేల పరుగులు చేసిన ఐదో భారత బ్యాట్స్మన్గా మొత్తంగా 13వ బ్యాట్స్మన్గా నిలిచాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), మహేంద్రసింగ్ ధోనీ (10,126) మాత్రమే ఈ రికార్డుని అందుకున్నారు. ఈ క్రమంలో సచిన్ రికార్డుని కోహ్లీ అధిగమించాడు.
సచిన్ రికార్డు బద్దలు
వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్ 259 ఇన్నింగ్స్లు తీసుకోగా కోహ్లీకి 205 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. మరోవైపు సౌరవ్ గంగూలీ 263, రికీ పాంటింగ్ 266 ఇన్నింగ్స్లు తీసుకున్నారు. ఇప్పటివరకు సచిన్ (259 ఇన్నింగ్స్) పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.
పదివేల పరుగులు చేసిన క్రికెటర్లు వీరే
* విరాట్ కోహ్లీ (213 వన్డేలు- భారత్)
* సచిన్ తెందుల్కర్ (266- భారత్)
* సౌరవ్ గంగూలీ (272- భారత్)
* రికీ పాంటింగ్ (272- ఆస్ట్రేలియా)
* జాక్వెస్ కలిస్ (286- దక్షిణాఫ్రికా)
* ఎంఎస్ ధోనీ (320- భారత్)
* బ్రియన్ లారా (287- వెస్టిండీస్)
* రాహుల్ ద్రవిడ్ (309- భారత్)


Click it and Unblock the Notifications

