మ్యాచ్ ఆరంభం నుంచీ ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ చెలరేగి ఆడారు. ఈ క్రమంలో తొలుత రోహిత్ శర్మ 107 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 28వ సెంచరీ కావడం విశేషం. ఆ తర్వాత కొద్దిసేపటికే కేఎల్ రాహుల్ కూడా సెంచరీ సాధించాడు.
విశాఖ వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ: అరుదైన జాబితాలో చోటు
💯
— BCCI (@BCCI) December 18, 2019
Hitman gets to this 28th ODI Century. His 7th ODI ton of 2019. Top Man 🙌🙌#INDvWI pic.twitter.com/vxJkExGywF
కేల్ రాహుల్ 102 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 101 పరుగులు చేశాడు. వన్డే వరల్డ్కప్ తర్వాత కేఎల్ రాహుల్ చేసిన మొదటి సెంచరీ ఇదే కావడం విశేషం. ఈ సెంచరీతో కేఎల్ రాహుల్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో తాను ఫస్ట్ చాయిస్ ఓపెనర్ అని మరోసారి నిరూపించుకున్నాడు.
అయితే, జట్టు స్కోరు 232 పరుగుల వద్ద కేఎల్ రాహుల్(102) జోసెఫ్ బౌలింగ్లో రోస్టన్ ఛేజ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. కేఎల్ రాహుల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టన్ విరాట్ కోహ్లీ డకౌట్గా వెనుదిరిగాడు. కీరన్ పొలార్డ్ బౌలింగ్లో రోస్టన్ చేజ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
మంచి భార్య రావాలని ఎప్పుడూ కోరుకోలేదు: సైనాను ఉద్దేశించి పారుపల్లి కశ్యప్
కోహ్లీ ఔటైన తర్వాత శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం 40 ఓవర్లకు గాను టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(140), అయ్యర్(7) పరుగులతో ఉన్నారు.
Here it is 💯
— BCCI (@BCCI) December 18, 2019
A fantastic innings as @klrahul11 brings up his 3rd ODI ton 👏👏#INDvWI pic.twitter.com/z4TiKocgeC